224
వాసిష్ఠరామాయణము
క. విను కర్మఫలత్యాగికి
దనుళవు మఱి సుకృతదుష్కృతంబులు, స్ఫటికం
బున వర్తిలు రాగమునా
యనువున ఫలకర్మరాగ మందదు తజ్ జ్ఞున్.257
క. జ్ఞానప్రాప్తిక్షణమున
దా నవు ముక్తుండు; పిదపఁ దను వది తీర్థ
స్నానమునఁ బడిన శ్వపచ
స్నానంబునఁ బడిన రెండు సమమ తలంపన్.258
వ. అని యివ్విధంబునఁ బరమజ్ఞానోపదేశంబు చేసి, బ్రహ్మవిదుండ వగు. మని
మనువు నిజగృహంబునకుం జనియె నిక్ష్వాకుండును నతండు సెప్పినట్ల
జీవన్ముక్తుం డై రాజ్యసుఖం బనుభవించుచుండె. నని యిక్ష్వాకూపా
ఖ్యానంబు సెప్పి, వసిష్ఠుండు.. విశ్రాంతస్వాంతుం డైనవానికి లౌకిగా
చారంబు తఱుచు లేకుండు, నీయర్థంబున మృగవ్యాధోపాఖ్యానం
బు నెఱింగించెద; ననిన రామచంద్రుం డి ట్లనియె.259
క. జీవన్ముక్తుల కధికము
గా వంటిరి మీరు గగనగమనాదులు ము,
న్నీవిధమునఁ దగువారల
కేవి యపూర్వాతిశయము లెఱిఁగింపుఁ డనన్.260
క. జ్ఞానికి నేయతిశయమును
నూనదు మదిఁ దాఁ దనంత, సురుతరమంత్ర
ధ్యానతపస్సిద్ధి నభో
యానాదులు గలుగు, దీన నధికత గలదే?261
క. ఆరయ విజ్ఞానికి సం
సారికిని విశ్లేష మెందు సకలంబున నా
స్థారహితంబును నిర్మల
వైరాగ్యము నైనమనసు వసుధాధీశా.262