పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

209

     మిని, మఱి నేను లేనపు డమేయపదార్థవీభాగదృష్టియున్
     జనియె, ననంతశాంతరససాగర మెల్లెడ నిట్లు దొట్టెడున్.182
వ. అని యిట్లు కుంభునిచేతఁ బ్రబోధితుండై పరమజ్ఞానవంతుఁ డైన య
     మ్మహీపాలుండు మహామోహసముద్రసముత్తీర్ణుం డై మఱియును.183
క. ఆ వటు నుపదేశము మది
     భావించి, చిదాత్మసౌఖ్యపదపరిణతుఁ డై,
     భూవిభుఁడు ఱాతిరూపము
     కైవడి, చిత్తంబుఁ గన్ను గదలక యుండెన్.184
వ. ఇవ్విధంబునఁ గొంతసేపునకుఁ బ్రబుద్ధుండును, బ్రస్ఫరితనయనుండు,
     నైన యతిని జూచి, కుంభరూపిణి యైనచూడాల యి ట్లనియె.185
గీ. అమల మై పూర్ణ మై మృదు వైనపదవి
     భానుఁడును బోలె విశ్రాంతిఁ బడయఁ గంటె,
     తరలెనే భ్రాంతి? గలదె యంతఃప్రబుద్ధి?
     ధ్యేయ మెఱిఁగితె; దృశ్యంబు దెలిసె నయ్య?186
చ. అన విని నీప్రసాదమున నన్నిటిమీఁద మహావిభూతియున్
     ఘనమును నైనచిత్పదవిఁ గంటిఁ; జిదాత్మవివేకు లైన స
     జ్జనపదసంగమం బమృతసారసుఖంబు మునీంద్ర; యిట్టి దేఁ
     గనుగొనమున్ను, నీకతనఁ గంటిని నే, డిది యేమి నావుడున్.187
సీ. ఆ కుంభుఁ డను – నృప, యంతవిశ్రాంత మై
                    యింద్రియోల్లసభోగేచ్ఛ లణఁగ,
     నాచార్యహితవాక్య మంటి చిత్తంబున
                    కాలపాకమున వృక్షమునఁ బండ్లు
     రాలు కైవడి, దేహమాలిన్య మురిఁబోవుఁ,
                    దివిరెడి తద్భేదదృష్టి నుండు