పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

175

     సప్తమాతృకలు నుత్సవవేళఁ గజకంఠుఁ
                    గొలుచువేడుక వెండికొండ కరుగ,
     నందు బ్రాహ్మికి వాహ మగుహంసికకు నలం
                    బుసవాహ మగుకాకపుంగవునకు
     బుట్టితిఁ; బుట్టినప్పుడు బ్రాహ్మి నా కిట్టి
                    విజ్ఞానసంపద వేడ్క నిచ్చె,
గీ. వెండి నాతండ్రి యిందు న న్నుండఁ బనిచె;
     నతనిపంపున నిం దుండ నగణితంబు
     లైనకల్పాంతములును మన్వంతరములు
     జనియె, నే నెన్ని చెప్పుదు మునివరేణ్య.17
వ. అనిన నే నిట్లంటిఁ. గల్పాంతంబులం దెట్టి యోగీంద్రులు నిత్తెఱంగున
     నున్నవారు లేరు. నీ వెత్తెఱంగున నుంటి? వనిన; నతండు౼మునీం
     ద్రా, యీశ్వరశాసనం బలంఘనీయంబు, గావునఁ గల్పాంతంబుల
     యందు పృథివ్యాధిభూతంబులంద యణగి వర్తించుచు నెక్కా
     లంబు సుఖించుచుండుదు౼ననిన; నతని కి ట్లంటి.18
క. నీవును జ్ఞానవిదుండవు,
     గావున మును సన్నబ్రహ్మకల్పంబులయం
     దే వేవి చూచి తేర్పడ,
     నావిధ మెఱిగింపు మనిన నతఁ డి ట్లనియెన్.19
మ. అనఘా, యే మని చెప్ప! ధాత్రి జనశూన్యం బయ్యెఁ బెక్కేఁడు; లం
     త నగ క్ష్మాజ లతా తృణాది యడరన్ దా భస్మ మై తోఁచె; న
     య్యినచంద్రాదులపుట్టువుల్, సురవరోపేంద్రస్థితుల్, క్రోడ మై
     కనకాక్షున్ హరి ద్రుంచుటల్, శిశువులై కాన్పింతు రింకేటికిన్.20
క. ము న్నేడుగురు వసిష్ఠులఁ
     గన్నారఁగఁ జూచినాడ కమలజతనయా,