పంచమాశ్వాసము
175
సప్తమాతృకలు నుత్సవవేళఁ గజకంఠుఁ
గొలుచువేడుక వెండికొండ కరుగ,
నందు బ్రాహ్మికి వాహ మగుహంసికకు నలం
బుసవాహ మగుకాకపుంగవునకు
బుట్టితిఁ; బుట్టినప్పుడు బ్రాహ్మి నా కిట్టి
విజ్ఞానసంపద వేడ్క నిచ్చె,
గీ. వెండి నాతండ్రి యిందు న న్నుండఁ బనిచె;
నతనిపంపున నిం దుండ నగణితంబు
లైనకల్పాంతములును మన్వంతరములు
జనియె, నే నెన్ని చెప్పుదు మునివరేణ్య.17
వ. అనిన నే నిట్లంటిఁ. గల్పాంతంబులం దెట్టి యోగీంద్రులు నిత్తెఱంగున
నున్నవారు లేరు. నీ వెత్తెఱంగున నుంటి? వనిన; నతండు౼మునీం
ద్రా, యీశ్వరశాసనం బలంఘనీయంబు, గావునఁ గల్పాంతంబుల
యందు పృథివ్యాధిభూతంబులంద యణగి వర్తించుచు నెక్కా
లంబు సుఖించుచుండుదు౼ననిన; నతని కి ట్లంటి.18
క. నీవును జ్ఞానవిదుండవు,
గావున మును సన్నబ్రహ్మకల్పంబులయం
దే వేవి చూచి తేర్పడ,
నావిధ మెఱిగింపు మనిన నతఁ డి ట్లనియెన్.19
మ. అనఘా, యే మని చెప్ప! ధాత్రి జనశూన్యం బయ్యెఁ బెక్కేఁడు; లం
త నగ క్ష్మాజ లతా తృణాది యడరన్ దా భస్మ మై తోఁచె; న
య్యినచంద్రాదులపుట్టువుల్, సురవరోపేంద్రస్థితుల్, క్రోడ మై
కనకాక్షున్ హరి ద్రుంచుటల్, శిశువులై కాన్పింతు రింకేటికిన్.20
క. ము న్నేడుగురు వసిష్ఠులఁ
గన్నారఁగఁ జూచినాడ కమలజతనయా,