పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

167

     య మ్మగుజాగరవిలాస మణుమాత్రము చి
     త్తమ్మునఁ దోఁపక యున్నపు
     డమ్మానస మింకఁ బుట్ట దని యెఱుఁగు మదిన్.285
వ. వాసనారాహిత్యం బగునంతన పరమశమప్రదంబై మనోలయం బగు.
     నది యె ట్లనిన.286
మ. అనిలస్పందనవాసనల్ పొడమ న ట్లన్యోన్య మేతద్ద్వయం
     బును బీజాంకురముల్ మనంబునకు నై పొల్పొందు; నీమూఁటికిన్
     విను బీజంబు ప్రపంచ; మట్లగుట సంవేద్యంబు వర్జింపు; మం
     తన నిర్మూలితవృక్షమట్ల యడఁగున్ దత్సర్వమున్ రాఘవా.287
గీ. వినుము సంవేద్యమునకు సంవిత్తు బీజ,
     మివియు నొండొంటి నెడబాసి యెందు లేవు,
     నూనెతోఁ బాసి నువ్వులు లేనియట్ల
     యని యెఱుంగుము, మనమున నినకులేశ.288
క. వారని విషయజ్ఞాన మ
     పారభవోదారదుఃఖపరకారణ మౌఁ;
     గోరిక గూరని విషయ
     స్ఫారజ్ఞానంబు సౌఖ్యపదహేతు వగున్.289

ఆకాశగత్యభావోపాఖ్యానము

వ. అనిన విని రామచంద్రుం డయ్యా, జాడ్యరహితుండును, నిర్విషయ
     జ్ఞానియు, నగు నతం డెట్టివాఁ డతనికి తజ్జడభావం బెట్లు నిర్వర్తించుఁ
     జెప్పవే యని యడిగిన, నప్పరమసంయమి యి ట్లనియె.290
క. సర్వావస్థలయందును
     నిర్వాణమనస్కుఁ డైననిత్యుఁడు జడుఁడున్
     నిర్విషయజ్ఞానియు నగు
     నుర్వీశ్వర, కార్యకోటియుతుఁ డై యున్నన్.291