పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

చతుర్థాశ్వాసము

     శ్రీ లొదవుఁ, జిత్తవృత్తుల
     జాలి యణఁగు, మోక్షపదము సమకూరుఁ మదిన్.177
వ. అని యి ట్లుద్దాలకోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగించి వసిష్ఠుం
     డు రామచంద్రుం గనుంగొని,౼యిక పరమసమాధికి నుత్తమావస్థ
     యగునట్టిచిత్తవిశ్రాంతి యెద్ది యదియ జీవన్ముక్తాశయం బగు నని వర్ణిం
     పంబడు. నీయర్థంబున సురఘూపాఖ్యానంబు సెప్పెద నాకర్ణింపు
     మని యి ట్లనియె.178
క. విను నీవ తెలిసి యీక్రమ
     మున విహరించుచు నతీతమును బరమును భా
     వనమును నగుతత్పదమున
     ననిశము విశ్రాంతిఁ బొందు మంబుజనయనా.179
వ. అనిన విని రామచంద్రుండు కృత్తాంజలి యై యి ట్లనియె౼మునీం
     ద్రా, త్రికాలవేది వగుని న్నొకటి యడిగెద. నొక్కండు సంసారవ్యా
     పారయుక్తుం డయ్యును సమాధినిష్ఠుండై నిరంతరవిశ్రాంతి గని సుఖిం
     చుచుండు. నొక్కం డేకాంతశీలుం డై పరమసమాధినియతి నుండు.
     నీయిరువురయందు నెవ్వండు ముఖ్యుం డాన తిమ్మని యడిగిన వసిష్ఠుం
     డి ట్లనియె.180
గీ. అఖిలగుణములు నాత్మ కా వని తలంచి
     యంతరంగంబు చల్ల నౌ నది సమాధి,
     దృశ్యములు లీన మౌ నను తెలివి గలిగి
     ధ్యాని యైనను వ్యవహారి యైన నేమి.181
వ. ఇట్లు నిరుపాధికచేతశ్శీతలత్వంబు కలుగుటం జేసి వీర లిరువురు సము.
     లట్టిశీతలత్వంబు మనోవృత్తిం జలింపం దొణంగెనేని యోగసమాధికి
     నుపక్రమంబు సేయవలయు. నున్మత్తంబు లగుచిత్తతాండవంబుల నా
     త్మసమాధానంబు లే కునికిం జేసి.182