పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

129

     దేవ, చిరకాలమునకు సిద్ధించి యుదితుఁ
     డై వెలింగెడు నిత్య యనంత నీవ
     యేన యగునాకు మ్రొక్కెద మానసమున.79
మ. అని చింతించుచు శత్రుసూదనుఁడు ప్రహ్లాదుండు దా నిర్విక
     ల్పనిరాలంబసమాధి నిల్చె మది లౌల్యం బింతయున్ లేక వ్రా
     సినరూపంబునుబోలె నేక మగుదృష్టిన్ పంచసాహస్రహా
     యనముల్ నిర్మలనిష్ఠతోఁ బరమయోగానందనిర్మగ్నుఁ డై.80
క. ఆయెడఁ బాతాళం బ
     న్యాయమును నరాజకంబు నై ప్రజ మాత్స
     ర్యాయమున లోభమోహ
     ప్రాయమున నశించుటయుఁ గృపాతత్పరుఁ డై.81
ఉ. కంబుగదాసిచక్రఘనకాంతులు బాహు లలంకరింప, వ
     క్షంబున శ్రీతనుద్యుతులు కౌస్తుభదీప్తుల బ్రోదిసేయఁగా,
     నంబుజపత్త్రసన్నిభకటాక్షరుచు ల్వొలయంగ వచ్చెఁ బీ
     తాంబరుఁ డంగకాన్తివిజితాంబరుఁ డా దితిపౌత్త్రుపాలికిన్.82
వ. ఇవ్విధంబున సకలజగజ్జాలపాలనశీలుం డగు నీలవర్ణుండు ప్రత్యక్షం
     బై— 'మహాప్రబుద్ధుండ వై మమ్ము నీక్షింపు' మనుచు దిగ్వలయం
     బద్రువఁ బాంచజన్యంబు పూరించిన.83
క. ఆ నినద మల్లనల్లన
     వీనులు సోకిన, సమాధి వీడ్కొని జలద
     ధ్వానమున నలరు శిఖిగతి
     నానందము నొంది సూచె హరి నరగంటన్.84
వ. ఇట్లు ప్రత్యక్షం బైనయప్పుండరీకాక్షు నిరీక్షించి పునఃపునఃప్రణా
     మంబు సేయుచున్న రాక్షసేశ్వరునకు నప్పరమేశ్వరుం డి ట్లనియె.85
సీ. పుణ్యాత్మ నీరూపమును రాజ్యలక్ష్మియుఁ