పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

115

     వాసనాయుక్తముగ నెడఁబాసి ప్రథమ
     దర్శనాభాస మైనయాత్మస్వరూప
     మెల్లకాలంబు నే భజియింతుఁ దగిలి.12
క. ఏవెలుఁగు తాన వెలుఁగఁగ
     నావెలుఁగునఁ గానిపించు నఖిలము వెలుఁ గై,
     తా వెలసి మొదల వెలిఁగెడు
     నా వెలుఁ గగునాత్మ నే నుపాసింతుఁ దగన్.13
వ. అనిన తృతీయసిద్ధుండు.14
గీ. కలదు లే దను రెండుపక్షములనడుమఁ
     జెంది సర్వంబుఁ బొడగానఁ జేయుచున్న
     యట్టి నిత్యస్వరూపంబు నాత్మయందు
     నిలిపి సద్భక్తి సతతంబు దలఁతు నేను.15
క. ఆకారము గల దనియు నీ
     రాకారం బనియు శూన్య మను జనమతముల్
     సోఁకక సంవిద్రూపు ని
     రాకారము నైనయాత్మ ననుసంధింతున్.16
వ. అనినఁ జతుర్థసిద్ధుం డి ట్లనియె.17
మత్తకోకిల. ఆజగత్పతి చిత్తగేహమునందుఁ గాపుర ముండగాఁ
     బూజసేయక యొండువేల్పులఁ బూని కొల్వఁగఁ బోవుటల్!
     రాజసంబునఁ జేతికౌస్తుభ రత్న మొల్లక బేల వై
     గాజుఁబూసలు విల్వ సేయఁగఁ గాంక్షసేసెద రే మనన్.18
క. అని సిద్ధవరులు పలికిన
     యనుపమగీతార్థగీత లన్నియుఁ దనలోఁ
     గనిఖేద మినుమడింపఁగ