పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

109

     నాస లేక సేయు నటు గాన కర్త గాఁ
     డెనయఁ గర్తల చెంత నునికిఁ జేసి.112
గీ. కార్యములు సేయునెడల దాఁ గాని వాఁడ
     యైనభావన గట్టిగా నాత్మ నిలిపి,
     సేయవలసినకార్యంబు సేయు, మన్ని
     పనులయెడను నిర్లేపతఁ బరఁగు మెందు.113
గీ. అట్లు గాక యున్న నఖిలంబునకు నేన
     కర్త ననుతలంపు గలిగియుండు;
     సకలకార్యములును సమతమైఁ జేసిన,
     యవియ యుత్తమంబు నని యెఱుంగు.114
వ, రాగద్వేషంబుల మోదఖేదంబులం దొఱంగి సంకల్పక్షయంబు సేయ
     సమతయ చిక్కియుండు. కాదేవి సర్వకర్తవ్యంబును నకర్తృత్వం
     బున విడిచి మనోలయంబు సేసి యెవ్వండు సుఖయించు నట్టివాఁడ
     వై సుఖియింపుము.115
క. విను దేహాహంకారము
     సునిశిత మగుచున్న కాలసూత్రపదవి దా
     పనపథ మవీచివాగుర
     ఘనమగునసిపత్త్రవనముఁ గాఁ దలఁపు మదిన్.116
ఉ. కర్తకు నేను నీతఁడును గా మని యైనఁ దలంపు, మింతకున్
     గర్తను నేను వేఱొకఁడు గాఁ డని యైనఁ దలంపు, మెవ్వఁడో
     కర్త మ ఱేను నెవ్వఁడనొ కార్యమునం దని యైన, నుత్తముల్
     వర్తిలుశిష్టమార్గమున వర్తిలి, సౌఖ్యము నొందు రాఘవా.117
క. వాసనలఁ దగులు బంధము,
     వాసన లుడుగుటయ మోక్షపద, మని మదిలో
     వాసనలు దొఱఁగి మఱి మో