పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్పదు నాఁగా వినతాతనూభవచలత్పక్షానిలంబుల్ సమ
స్తదిశాకోణము లాక్రమింపఁ గటిభాస్వత్పీతవాసంబుతోన్.

39


గీ.

ఇట్లు తోఁచి మురారాతి యేమిపనికి, నై తలంచితి వినిపింపు మనిన మౌని
దేవ కారుణ్యమున మముఁ గావు సబలు, దుర్జయనృపాలు దేవతాద్రోహిఁ దునిమి.

40


మహాస్రగ్ధర.

అనుచున్ సాష్టాంగముల్ సంయమి సలుప నుదగ్రాగ్రహవ్యగ్రతన్ వై
చినచక్రం బావిరోధిక్షితిపతి నడఁగించెం బలంబు దహించె
మొనలన్ వేయింటి చుక్కల్ మురిసి ధరణిపై మ్రుగ్గుచందంబుగాఁ గాం
చనగర్భాండప్రపూర్ణజ్వలదనలశిఖాసంఘజంఘాలికంబై.

41


సీ.

అంతటఁ జక్రంబు శాంతమై నిజభుజాగ్రమునఁ జేరిన శౌరి గౌరముఖుని
తోడ ని ట్లనియె నిందు విరోధిసైన్యంబు నిమిషమాత్రంబున సమసెఁ గాన
నీమహారణ్యంబు నైమిషం బనఁబడు నిచ్చోట నే వసియింతు యజ్ఞ
పురుషుఁడనై రత్నమున జనించినయీపదేవురు తరువాతఁ గృతయుగమున
జలధివలయితవిశ్వవిశ్వంభరాత, లేంద్రులై పుట్టఁ గల రని యెఱుఁగఁ జెప్పి
చనియె శిష్యగణంబుఁ దానును దపస్వి, కులమణియు నుండె నాశ్రమస్థలమునందు.

42


క.

ధరణీ యీకరణి నిశా, చరహరచక్రమున సుతుఁడు సమసిన విని శో
కరసార్ణవమున మునుఁగుచు, నిరవద్యుఁడు సుప్రతీకనృపతి వికలుఁడై.

43


గీ.

ఎట్టకేలకు ధైర్యంబు హృదయమునకు, నూలుకొలుపుచు నారాయణుండు రాముఁ
డనఁగ నున్నాఁడు చిత్రకూటాద్రిమీఁద, రామసంజ్ఞను వినుతింతు నామహాత్ము.

44


వ.

అని కృతనిశ్చయుండై శ్రీరామ కారుణ్యరసాబ్ధిసోమ నిశాతశిలీముఖవిఖండితనిశాచ
రయూథ నరనాథ ప్రపన్నార్తిహరణప్రవీణ సురూపధురీణ విజయలక్ష్మీకళానిస్తంద్ర
పురాణకవీంద్ర దేవా నీవ సూక్ష్మాకారంబున సకలతేజంబులకు మహత్తరతేజంబులు
గావింతువు భూతత్త్వంబున నైదుగుణంబులు జలతత్త్వంబున నాలుగుగుణంబులు
రజస్తత్త్వంబున మూఁడుగుణంబులు వాయుతత్త్వంబున రెండుగుణంబులు నభ
స్తత్త్వంబున నొక్కగుణంబును నై నిలుతువు. దుఃఖజరాబడబాగ్నిభయంకరం
బును బహిరభ్యంత రేంద్రియగ్రాహదురవగాహంబును నైనసంసారసాగరంబున
మునుఁగుజంతుసంతానంబులు భవదీయనామంబులు దలంచినఁ దరితెఱంగున దరి
చేర్తువు సచరాచరప్రపంచంబు నీయంద రమించుటం జేసి రామాభిధానంబున
విహరింతువు లోకోపకారార్థంబు మీనకూర్మాద్యవతారంబులు వర్తింతువు సంవర్త
సమయంబున ధగద్ధగితహరిదంతరాళకరాళకీలానలంబవై విజృంభింతువు దేవాది