పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంతకుమున్న దుర్జయమహీకాంతుండు సమయోచితరాగంబుల నిజవిజయాంకి
తంబు లయినగీతంబులు మంగళగాయకులు పాడ వదనసౌభాగ్యంబు మ్రుచ్చిలింప
వచ్చినయిందుబింబం బనంగ బింబాధర ధరియించిన మెఱుంగుటద్దంబు గనుం
గొనుచు మేల్కాంచె నని వరాహదేవుండు చెప్పిన విని యిలావిలాసిని తరువాతి
వృత్తాంతం బానతిమ్మని విన్నవించిన.

172


శా.

పుంగ్రామణ్యవతంస వైష్ణవకథాపూతాత్మ సంత్రాసకృ
త్సంగ్రామాంగణపాండవార్జున భుజస్తంభానికుంభీనసా
లంగ్రస్తాఖిలమత్తశాత్రవనృపాలప్రాణవాతూల సా
యంగావస్థరవిచ్ఛవిస్తనవి లేపాబ్చేత్రణాలింగితా.

173


క.

తుళ్వకులజలధికల్పక, సాళ్వశ్రీనారసింహజనపాలస్ప
ర్థాళ్విభకంఠీరవ మణి, గాళ్వతులాకోటిరుచివికస్వరచరణా.

174


భుజంగప్రయాతము.

సఖీభూతదోశ్చాపసంవర్తవేళా
శిఖావత్సమిద్ధప్రసిద్ధప్రతాపా
మఖోద్ధారణస్ఫూర్తిమారారిశోటీ
రఖేలద్ద్యగంగాతరంగాభకీర్తీ.

175

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంట నాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ జతుర్థాశ్వాసము.