పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కనుఁగొన్నమొదలు తక్కినమాట లాలింప బుద్ధిపుట్టనిపుట్టుభోగి విడిచి
వా లిచ్చి నడవడి వర్ణింపఁదగినలావరిదిగ్గజమువంటివాని విడిచి
తనలోఁతుపాఁతుసైతము గానరాఁ గూర్మి గలసినమొగిమోటకాని వదలి
నిలుకడ గలకూటములఁ బాయఁజాలక మరిగినకొండంతదొర దొఱంగి
వలచి వచ్చిన నిల్లాలిబలె భరించి, పసలఁ జిక్కించి విలసనప్రౌఢనిజభు
జాపరీరంభసుఖములచవులు చూపె, విశ్వధాత్రికిఁ దిమ్మయయీశ్వరుండు.

32


క.

సరి వచ్చు నీతిభూతివి, తరణంబులఁ దిమ్మధరణిధవనందనుఁ డీ
శ్వరుఁడు యుగంధరశితికం, ధరకంధరములకు నని జనంబు నుతింపన్.

33


క.

ఆబాంధవనిధి గౌరాం, బాబుక్కాంబల వరించెఁ బరమవివేక
ప్రాబల్యంబున భూల, క్ష్మీబాలలఁ బెండ్లి యైనశ్రీహరిపోలెన్.

34


క.

అదితికి నింద్రోపేంద్రులు విదితప్రాభవులు సంభవించినపగిదిన్
సదమలపతివ్రతాసం, పద వెలసినతత్సరోజపత్రాక్షులలోన్.

35


క.

బుక్కాంబకు జన్మించిరి చక్కనిరూపములఁ బంచసాయకు లనఁ బెం
పెక్కినభుజాబలంబున, దిక్కరు లన నారసింహతిమ్మకుమారుల్.

36


గీ.

ఇట్లు తుళువాన్వయాగ్రణి యీశ్వరుండు, పూర్వజన్మతపఃఫలంబునఁ గులంబు
ధన్యత వహింపఁ గన్నపుత్రకులలోనఁ, బ్రభుత గైకొని నరసింహపార్థివుండు.

37


క.

భువనంబులు మెచ్చఁగ శైశవయౌవనసంధి సప్తసంతానములున్
సవరించె వాని కెవ్వరు, సవతు సుధాంధసులు దక్క సర్వంసహపైన్.

38


సీ.

చర్చించి చూచిన, సర్వజ్ఞతాపటుప్రౌఢిమ మరువంబు పరిమళంబు
పరికించి చూచిన నిరుపమత్యాగలక్ష్మీవిలాసము దేవతావరంబు
భావించి చూచిన బహుమానసమ్యగ్దయావిశేషోక్తి శిలాక్షరంబు
తర్కించి చూచిన ధర్మసంపాదనక్రీడావివేకంబు తోడునీడ
దుర్మదారాతిహరణచాతుర్యధైర్య, వీర్యగాంభీర్యగుణములు వెన్నతోడఁ
బెట్టినవి సాటి చెప్పుట యెట్టు నృపుల, నీశ్వరప్రభునరసపృథ్వీశ్వరునకు.

39


స్రగ్ధర.

ఉద్ఘాటించున్ సమిత్సంయుతరిపునృపతివ్యూహకల్పాంతకాలో
ద్యర్ఘర్మాంశుప్రభాళీధళధళనిభముల్ తాంతకాంతారభూ
ద్యద్ఘోరాగ్నిచ్ఛటాశ్రీధగధగసరముల్ దర్పసంపత్కళాభా
స్వద్ఘోటీఘోటధాటీశ్వరనరసనరేశప్రతాపాతపంబుల్.

40


సీ.

వివిధచిహ్నంబులు వేర్వేర పూనంగ విష్ణుశంకరులు భావింప వచ్చె
సూచికాముఖమునఁ జూడంగ హరినీలహీరోపలంబుల నెఱుఁగ వచ్చె