పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చైరావత్యలకుంతల న్మొఱఁగి జోడై చంపకక్ష్మాజముం
జేరం గ్రమ్మఱ నేగుదెంఛిరి సుకేశీమిత్రకేశీసతుల్.

127


క.

అది యెఱిఁగి బాలికల ని, ల్పుద మని పఱతెంచి నెచ్చెలులు రత్నవతీ
కదళికలు విన్నవించిరి, మృదులోక్తుల మరులుగొన్న మెలఁతలతోడన్.

128


మ.

నగరే చూచినవారు మీరు మదనోన్మాదంబునం బొందినన్
మగవారి న్మొగ మెత్తి చూడఁ గులకన్యాధర్మముల్ దప్పవే
తగవే పైకొనఁ గాక కూర్మి బలవంతం బైన నారాజు ధై
ర్యగుణోదాత్తునిఁ దెత్తు మబ్జముఖులారా యేల చింతింపఁగన్.

129


క.

అన మరలి చనిరి నమ్రా, ననలై నన లైదు నేర్పునను శరములఁ జే
సినవిలుకాఁడు గుఱించిన, తనువుల హేతిప్రహేతితనయలు సనయల్.

130


సీ.

ఇట దుర్జయతలేంద్రుండు కన్యకావీక్షణసంప్రాప్తవిరహవేద
నాయత్తుఁడై వేఁగఁ బ్రాణసఖుండు విద్యారక్షకుఁడు చూచి ధరణినాథ
యేను లతాంగులవృత్తాంత మెఱుఁగుదు విను మందరాచలంబునకు నికట
మున నున్నపాటలం బనుపురంబున వేలుపులకు నాతంకించి వలస వచ్చి
నిలిచి యెప్పుడు నీదురాకలకు నెదురు, చూచు హేతిప్రహేతులసుతలు మీఁది
పని ఘటించెద విచ్చేయు మనిన సంత, సిల్లి యక్షేశ్వరారామసీమ వెడలి.

131


వ.

నిజభుజప్రతాపంబునకు వెఱచి భానుమంతుం డనుసామంతుండు వినతాపత్య
పురస్సరంబుగాఁ బొడసూపి పగలు నాలుగుజాములుం బాదంబులు సేవించి సం
ధ్యాసమయంబునం గరకమలంబులు మోడ్చి పశ్చిమభూధరం బనునివాసంబు
నకుం బోవుచు రాత్రి గొలువంబెట్టినకిరణంబులకరణిఁ గరదీపికాసహస్రంబులు
వెలుంగ మకరాకరగర్భంబున నెవ్వనిబాధలకుం గాక చిరకాలంబు డాఁగె నట్టి
గోత్రభేదిం బట్టి మనికిపట్టు విడిచి పాఱం గొట్టుట విని భయంబు దక్కి
తన్ను భజింప వచ్చినమైనాకంబుచందంబున మెఱయునుభయపార్శ్వలంబమాన
చమరవాలం బైనభద్రశుండాలంబు నాయితంబు చేసి తెచ్చిన నెక్కి క్రిక్కిఱి
సినహేతిప్రహేతికన్యకాకుచకుంభంబు లిప్పగిది నప్పళింప నెప్పుడు దొరకునో
యనువిధంబునఁ దద్గజేంద్రకుంభంబు లప్పటప్పటికి నప్పళించుచు వాహినీవాహినీ
శ్వరప్రాచీనవేలంబునకు వేలంబునం జని యామకుంజరగ్రైవేయఘంటాఘణా
త్కారబధిరితాఖిలదిశాంతం బైనపటనిశాంతంబుబహిరంగణంబున నేనుఁగు డిగ్గి
పరివారంబు నిలిపి విద్యారక్షకుముంజేయి కరతలంబున నవలంబించి శయ్యాగృ
హంబు సొచ్చె నని వరాహదేవుండు చెప్పిన విపులాచపలాక్షి మీఁదటివృత్తాం
తం బానతి మ్మని విన్నవించిన.

132