పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జించుధన్యులగృహంబునందు లక్ష్మీనారాయణుండు సుప్రతిష్ఠుండై యుండు
నని వరాహదేవుండు ధరావరారోహ కానతిచ్చె.

75


మ.

నరకంఠీరవ చండబాహుబలశుండానాళికాశీకర
స్ఫురణాష్టద్విపసార్వభౌమతుహినాంభోభస్త్రికాధారవ
ద్దరదీశానసదానుభూతభువనద్వ్యాప్తా ప్రతాపోష్మసం
భర ధాత్రీసురకారితాధ్వరహవిర్మాద్యద్దివౌకస్తుతా.

76


క.

రామానుతతనుమారా, తామరసాతతకరాకతతసారమతా
శ్రీమహిమహమహిమ శ్రీ, రామసమసరాగసాగరాసమసమరా.

77


జాతివృత్తహరిణి.

తరుణహరిణీనేత్రాచేతోజ దానధురంధరా
నిరుపమకళావైయాత్యాస్థాన నీతియుగంధరా
నిరతవిసరద్దానస్రోతస్వినీతనుజార్పణా
దరణచతురంతోదన్వత్కూకుదోద్బలసింధురా.

78

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాఖి
ధాన ఘంట నాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహాప్రబం
ధంబున సర్వంబును ద్వాదశాశ్వాసము.
————
సంపూర్ణము