పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొరుఁగం దెల్లనిమేనితోడ నొరగెన్ ఘూర్నిల్లుచున్ లోకభీ
కరజంఝానిలభజ్యమానసగవాక్షవ్రాతసౌధాకృతిన్.

106


మ.

మహిషుం డప్పుడు జన్యభూమిఁ దనకుం బ్రా పైనబల్వీరు యా
జ్ఞహరుం జంపినఁ జూచి మండిపడి దోస్తంభంబునం ద్రిప్పి దు
స్సహభంగిన్ గద వైవ దేవి నిశితాస్త్రం బేసినన్ దానిచే
మహిఁ గూలెన్ శకలంబులై గద గరుత్మల్లూనసర్పం బనన్.

107


మ.

అవలీలం బరిమార్తు నంచు వరలబ్ధాభీలచక్రంబు దా
నవుఁ డెత్తె న్వడి నేలఁ గూలె నదియున్ సర్వేశ్వరీహుంక్రియా
రవనైష్ఠుర్యమహానుభావమునఁ దద్రక్షఃకులస్త్రీజన
శ్రవణస్థాపితహేమరత్నమయపత్రభ్రంశసంసూచియై.

108


సీ.

ఈరీతిఁ బెనఁగుచో నింద్రారి వైష్ణవికఱకుటంపర చూచి వెఱచి పఱచు
పఱచి వెండియు సిగ్గు పాటించి భీకరసైరిభాకృతి దాల్చి చేర వచ్చు
వచ్చి పంచాననవాహనాహేతినిర్భగ్నుఁడై పెక్కురూపములు చూపు
పెక్కురూపములు చూపి ముహూర్తమాత్రంబు పోరాడి మాయమైపోవు మఱియు
దవులఁ బొడకట్టుఁ దన్నంటఁ దఱము నపర, చేతఁ జిక్కియుఁ జిక్కక చెంగిపోవుఁ
గాని మదిలోన గెలుపాస మానఁ డయ్యె, నెవ్వనికి మాన్పఁగా వచ్చు నెనుపమరులు.

109


ఉ.

ఈగతి వేయివత్సరము లెక్కటిఁ బోరి త్రిలోకమాత చే
తోగతరోషఖేదములతో హరి డిగ్గి త్రిశూలపాణియై
వ్రేఁగుఁజనుంగవ న్నడుము వీఁగ సతాండవకుండలప్రభా
భోగనిభాసికోమలకపోలయుగంబు చెమర్పఁగా వడిన్.

110


శా.

కంటిం గంటి నటంచు నార్చి శతశృంగక్ష్మాధరాగ్రంబునన్
వెంటాడించి కరాళకీలపటలక్ష్వేళాశ్రయార్చిశ్ఛటా
లుంటాకప్రతిఘాభరారుణదృగాలోకంబు సంధిల్లఁ గా
లంటం ద్రొక్కి లులాయదానవునివక్షోగ్రంబు శూలంబునన్.

111

కందగర్భమణిగణనికరము

డమరుకసరభసఢమఢమసమ వి, శ్రమము లయి మొరయ సమణివలయముల్
గమకపుఁజనుఁగవ గదలఁగ సమర, శ్రమ ఫలము గలుగ సరగునఁ బొడిచెన్.

112


చ.

పొడిచియుఁ గోప మాఱక నభోగతదివ్యులు పుష్పవర్షముల్
బడి గొలుపన్ భుజాకలితశాతకృపాణకఠోరధారచే