పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇంక నొక్కకారణంబు గలదు భవదీయదేహవర్ణత్రయంబు విభజించి మూర్తిత్ర
యంబుఁ గల్పింపు మనిన నద్దేవతామతల్లి పింఛతాపింఛరింఛోళినీలచ్ఛాయం బగు
చు నొక్కకాయంబును సంధ్యారాగసౌగంధికబంధూకబంధురుచిప్రవాహం బగు
నొక్కదేహంబును హారకర్పూరతారనీహారగౌరం బగునొక్కశరీరంబును వహించె
నందులో ధవళవర్ణయు వీణాపుస్తకపాణియు బ్రహసృష్ట్యభిధానయుం బ్రపంచ
నిర్మాణకర్మఠయు నగుబ్రహ్మశక్తి చరాచరవ్యాపకత్వంబు గోరి తపంబు చేయవలసి
ధాతచేత ననుజాతయై శ్వేతపర్వతంబునకుం జనియె రక్తవర్ణయు శంఖచక్రపాణి
యు లోకపాలనియు విష్ణుమాయాభిధానయు నగువిష్ణుశక్తి ముకుందునిచేత ననిపిం
చుకొని మందరకందరంబునకుం దపంబు సలుప నరిగె నీలవర్ణయు శూలపాణియు
దంష్ట్రాకరాళినామధేయయు జగత్సంహారకారిణియు నగురుద్రశక్తి నీలకంఠు
నకుం జెప్పి నీలశైలంబునకుం దపంబు చేయ నరిగె నప్పుడు హరివిరించిప్రముఖ
నిఖిలగీర్వాణులు దుర్వారపూర్వగీర్వాణగర్వసముద్రంబు లింక నింకు నని సంత
సించుచు నుమామహేశ్వరుల వీడుకొని తమతమనివాసంబులకుం జని రంతటం
గొంతకాలంబున.

20


క.

గీరీశుఁడు తనసర్గం, బేరీతిఁ బ్రయాసపడ్డ
నీడేరక ని
ష్కారణమ హానిఁ బొందఁగ, సారెకుఁ గావించి మిగుల సదమద మగుచున్.

21


గీ.

నీటివ్రాలకరణి నేటికిఁ దోడ్తోన, సృష్టి నష్ట మయ్యెఁ గష్ట మనుచు
జ్ఞానదృష్టిఁ జూచి నైజశక్తి తపంబు, సలుప శ్వేతగిరికిఁ జనుట దెలిసి.

22


ఉ.

ఆగిరి కేగి చూచెఁ బరమామృత మాకృతి దాల్చి నిల్చెనో
నాఁగ వెలుంగుచున్ గరమునం జపమాలిక పూని లీల నే
నీగతిఁ బద్మజాండము లనేకము లెప్పుడుఁ ద్రిప్ప నేర్తు నన్
బాగునఁ ద్రిప్పుచున్న తనప్రాణపదం బగుసృష్టిదేవతన్.

23


సీ.

కాంచి కల్యాణి యేకాంక్షఁ గావించెదు నిష్ఠురతప మతినిష్ఠ నీవు
మెచ్చి వరంబు లీ వచ్చితి నడుగుము నా బ్రహ్మసృష్టి యన్నలువతోడ
నొకవంక నడఁగి యే నుండఁగ నోప సర్వగతత్వ మి మ్మన్న స్రష్ట దద్వ
రం బిచ్చి తనశరీరంబున నాదేవి జలముఁ బాలును బోలెఁ గలపికొనియె
నది మొదలు సృష్టి వర్ధిల్లె ననలుఁ గొనలుఁ, బాతి బ్రహ్మకు మిక్కిలి నూఱ టయ్యె
శక్తి గలిగినకతన నశక్తు లైన, వారిచేఁతలు కొనసాగి వచ్చు నెట్లు.

24


క.

వనజభవుఁ డపుచు సంతస, మునఁ దనశక్తిం దలంచి పొగడఁ దొడంగెం
గనకగిరిశృంగరంగ, త్ఖనదీఘనదీర్ఘలహరికాఘుమఘుమికిన్.

25