పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోలాహలము చిత్రకూటము శైకృతస్థలము తుంగప్రస్థధరణిధరము
ననఁగ నివియుఁ బ్రసిద్ధంబు లైనగిరులు, మఱియు నుపపర్వతంబులు దఱచు గలవు
వీనియవకాశములయందె వెలయు నార్య, జనపద మ్లేచ్ఛజనపద సంచయములు.

164


వ.

ఈజనపదంబులం బ్రవహించి కులపర్వతంబులవలనం బుట్టిన ప్రధాననదులు చె
ప్పెద గంగ సింధు సరస్వతి శతద్రు చంద్రభాగ సరయు యమున యిరావతి చక్షు
ర్లౌహిత్య వితస్థ విపాశ దేవిక ఋభు గోమతి భూతపాప బాహుద దృషద్వతి
కౌశికి నిశ్చిర గండకి యివి హిమవంతంబునం బుట్టినవి వేదస్నాతి వేదవతి తృణ
ఘ్ని సింధువర్ణ నంద సదార రోమహి పరచర్మణ్వతి లయ విదశ దేవత్రయ యవంతి
యివి పారియాత్రంబునం బ్రభవించినవి శోణ జ్యోతిరథ సురకర్తృష మందాకిని
దాశార్ణ చిత్రకూట పిప్పల కరతోయ విశాఖిక చిత్రోత్పల విశాల వజ్రవాలుక వా
లుకావాహిని నక్రవతి ఋజ్వికిరి త్రిదివ యివి ఋక్ష్యపర్వతంబున జనియించినవి
మణిజాల శుభ పయోష్ణి శీఘ్రోద వేణువార వైతరణి వీచివారి కుముద్వతి క్రోధ
దుర్గ యంతశ్శిల యివి వింధ్యపాదంబున నవతరించినవి గోదావరి కృష్ణవేణి భీమ
రథి మలప్రహారి తుంగభద్ర కావేరి హేమ లక్ష్మణ కపిల యివి సహ్యంబునం
బ్రాదుర్భవించినవి తామ్రపర్ణి యుత్పలావతి యివి మొదలైనవి మలయపర్వతం
బున సంభవించినవి త్రిసామ ఋషికల్య త్రిదివ లాంగలిని వంశవర మహేంద్ర
తనయ ఋషిత ద్యుతిమతి మందమందగామిని నీలపిశాచిని యివి శుక్తిమంతంబునం
గలిగినవి మఱి యున్నవి యన్నియును క్షుద్రనదులుగా నెఱుంగుఁడు.

165


క.

ఈజంబూద్వీపమునకు, యోజనములు లక్ష యొప్పు నుదధియు నంతే
యోజన్ శాకద్వీపం, బీజంబూద్వీపమునకు నినుమడి విరివిన్.

166


సీ.

ఇట్టిశాకద్వీప మిరువంక లవణాబ్దిఁ దిరిగి వచ్చినది యీదీవిలోని
ప్రజలు దుర్భిక్షజరారుజ లెఱుఁగరు కులపర్వతము లేడు నిలుచు నచట
రెండేసిపేళ్ళ నాకొండలు విలసిల్లు నుదయసౌవర్ణాఖ్య లొక్కగిరికి
జలధరంబును నింద్రశైలంబు నొక్కటి రైవతకంబు నారదము నొకటి
శ్యామదుందుభు లొక్కటి సోమరజత, కంబు లొక్కటి కేసరి యాంబికేయ
మనఁగ నొక్కటి క్షేమమహాద్రుమంబు, లనఁగ నొక్కటి యిట్లు వర్షాహ్వయములు.

167


క.

నారద మనుపర్వతమున నారదపర్వతులు పుట్టినా రింద్రగిరిన్
నీరు గొని వచ్చి యింద్రుఁడు, సారెకు వర్షించుచుండు జగములయందున్.

168


గీ.

అందును గుమారికా చారి నంద వేణి, ధేనువు గభస్తి యిక్షుమతియు ననఁగ
నదులు గల వేడు వీనికి నామకములు, కలవు రెండవయవియుఁ గొండలకు వలెనె.

169