పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గలిగి కర్ణికవలె నున్నకనకగిరికిఁ, గేసరాకృతి భద్రాశ్వకేతుమాల
భారతోత్తరకురువర్షపర్వతములు, నిలుచుఁ గెళవుల లోకవర్ణితము లగుచు.

111


చ.

మునివరులార తత్కుధరమూర్ధమునం బదునాల్గువేలయో
జనములఁ జూడ నొప్పు సమచౌకపునెత్తము నిండి రత్నకాం
చనమయతోరణావరణసౌధవిలాసముచేతఁ జాలవ
ర్ణనమున కెక్కు నొక్కనగరంబు మనోవతి నాఁగఁ దత్పురిన్.

112


సీ.

సకలజీవులయందు సమబుద్దు లగువారు సత్యసంధత్వంబు జరపువారు
వెన్నీక రణములో విగతాసు లగువారు వివిధాధ్వరములు గావించువారు
పితృమాతృవచనంబు లతకరింపనివారు దానపరాయణు లైనవారు
బ్రహ్మవిజ్ఞానతత్పరత గల్గినవారు నిజకులాచారంబు నెఱపువారు
నాదిగాఁ గలపుణ్యులు నమరయక్ష, గరుడగంధర్వకిన్నరఖచరదైత్య
సిద్ధసాధ్యులు తనపాదసేవ చేయ మహిమఁ గొలువుండు నెపుడు తామరసభవుఁడు.

113


వ.

ఇవ్విధంబున బ్రహ్మచర్యానిర్వికల్పులు ననల్పవిజ్ఞానాకల్పులు స్త్రీశూద్రసం
కల్పులు నై పరమయోగిపుంగవులు పూజానమస్కారాదికంబులం గొలువ నున్న
నలువకు రాజధాని యైనమనోవతీనగరంబు దనకు మణికిరీటంబుగా మెఱయు
మేరునగరాజంబునకు రెడ్డికంబునుం బోలె నొడ్డునం బదివేలయోజనంబులు పొడ
వున ముప్పదివేలయోజనంబులు నై చుట్టి వచ్చి వియచ్చరగవికఠోరఖురకర్షణ
విశేషితపరాగపద్మరాగద్యుతిద్విగుణశోణమకరందకందళితమందారహరిచందనప్ర
వాళం బగుచక్రవాళంబున సూర్యాదిగ్రహంబులు సంచరించు నన్నగంబుతూరు
పునెత్తంబున మత్తనక్తంచరదురవగాహంబును మణిమయగేహంబును రంభాదినటీ
నాట్యశాలామృదంగదింధిమధ్వనిసంపూర్ణంబును విమానశతసంకీర్ణంబును ధగధగా
యతధ్వజపటప్రసూతబహుసహస్రైరావతియు నగునమరావతిపురం బంద మందు
నందు నడుమ వజ్రవైడూర్యమయవేదికాసీను లైనసర్వదేవయోనులు సేవింప
సుధర్మాస్థానంబున నాఖండలుండు నిండుగొలు వుండు రెండవదిక్కునం దాదృశ
గుణవిరాజితం బైనతేజోవతీపురంబున సర్వదేవనమస్కృతుండై శిఖాశతసహస్ర
దుర్నిరీక్షదేహుండు హవ్యవాహుండు వెలుంగుచుండు మూఁడవదిక్కున సకలసౌ
భాగ్యకోకిలంబులకు నామని సంయమని శ్రమనుం డధివసించు నాలవదిక్కున నఖిల
నగరవిజిష్ణుగుణ కృష్ణగుణ కర్బురుం డేలు నేనవదిక్కున సాధ్యసిద్ధపతి వరుణుండు
పరిపాలించు నాఱవదిక్కున విరచిత సర్వనగరగర్వకుట్టణంబు గంధవతీపట్టణంబు
నం బ్రభంజనుండు విజృంభించు నేడవదిక్కున నిరవధికనిధిసమూహోదయనక్షత్ర