పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్తువుపాత్రంబును శ్రావణాదికములందున్ శాకపాత్రంబు వి
ప్రవరశ్రేణికి నిచ్చి కార్తికమునం బ్రాగ్వద్విధానంబునన్.

33


వ.

శుక్లపక్షంబునం బాడ్యమి మొదలుగా నేకభుక్తంబు సలిపి దశమినాఁడు నేమం
బున మాసనామంబున హరిం బూజించి యేకాదశీదినంబున నుపవసించి సర్వబీజ
సమన్వితంబును బాతాళకులపర్వతాంకితంబునుంగా యథాశక్తి సువర్ణంబునం జేసిన
మహిప్రతిమ సితవస్త్రయుగళంబునం బొదిగి హరిపురోభాగంబున నిలిపి పంచ
రత్నంబుల నర్చించి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబున
నేకవింశతిమహీసురులకు నొక్కొక్కధేనువును నొక్కొక్కపచ్చడంబును నొ
క్కొక్కగ్రామంబునుం గుండలాంగుళీయకగ్రైవేయకసహితంబుగా నుత్తముం
డొసంగవలయు మధ్యముండు గ్రామవిరహితంబుగాఁ దక్కినవన్నియు నీవలయు
నంతకంటెను దరిద్రుండు యథాశక్తి భూవస్త్రభూషణచ్ఛత్రపాదుకాదులు సమర్పిం
పవలయు దామోదర ప్రీతో భవ తని భూప్రతిమాదానం బిచ్చి షడ్రసాహారంబుల
బ్రాహ్మణసంతర్పణంబు గావింపవలయు నేతద్వ్రతమాహాత్యంబు వర్ణింప శక్యంబు
గాదు మేదినీశ్వరా యిమ్మహావ్రతంబునకుఁ దగినయితిహాసంబు చెప్పెద.

34


క.

నందనులు లేక మున్ను ఫ, లందనుఁ డనురాజు విధివలన నీవ్రత మా
నందంబున విని చేయఁ బు, రందరవంద్యుండు శౌరి ప్రత్యక్షంబై.

35


మ.

వినతుం డైననృపాలపుంగవుఁ గృపాన్వీతేక్షణాబ్జంబులన్
గని నీకు న్వర మిత్తు వేఁడు మనఁ బ్రఖ్యాతుం జతుర్వేదవే
ది నసంఖ్యాతవసున్ జిదాత్మకు సుతున్ దేహావసానంబునం
దనకున్ మోక్షము వేఁడఁగా నొసఁగి యంతర్థానముం బొందినన్.

36


క.

ఉత్సాహంబున నాభూ, భృత్సామజుఁ డోలలాడి ప్రియసతివలనన్
వత్సరములోనఁ గనియెను, వత్సప్రియనామధేయు వరసుతు నొకనిన్.

37


ఉ.

ఆతనయుం గ్రమోపగతయౌవనుఁ బట్టము గట్టి విశ్వధా
త్రీతల మెల్ల నేలు మని దీవన లిచ్చి ఫలందునుండు ల
క్షీతరుణీమనోహరు భజింపఁ దలంచి విరక్తుఁడై పురా
రాతియనుంగుమామశిఖరంబున కేగి తపంబు చేయుచున్.

38


లయగ్రాహి.

అక్షరపురుష్టుతయథోక్షజనిరాకృతిరణక్షుభితకేశిముఖరాక్షసపయోజా
తేక్షణ జగత్రితయరక్షక జనార్దన సులక్షణ ఖలప్రకరశిక్షక సమస్తా
ఘక్షయకరస్మరణ కుక్షిగతలోక విజితాక్ష నిజభక్తసురవృక్ష మునిదేతా
ధ్యక్షమత భాస్కరవళక్షకరబింబశతలక్షసమభాభరిత పక్షివరవాహా.

39