పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్కనుకంటె న్మును లేచి భూతగణరక్షాధారణాపాత్రి ధా
త్రి నమస్తే యని పల్కి పుచ్చుకొని మృత్పిండంబు హస్తంబునన్.

7


క.

జలజభవాండోదరమునఁ గలిగినతీర్థములు తావకము లైనకరం
బులఁ బుట్టినవి దినేశ్వర, త్రిలోకనుత నాకు నిమ్ము తీర్థఫలంబుల్.

8


గీ.

అని మహీభాస్కరులఁ గొనియాడి మృత్స్న, మూఁడుమాఱులు నైజాంగముల నలందు
కొని నదీసలిలంబులఁ గ్రుంకి నిత్య, కృత్యములు దీర్చి యింటికి నేగుదెంచి.

9


వ.

శాతకుంభకుంభరంభాస్తంభదర్పణధవళచామరసురభిమాల్యవితానంబుల నలంకృ
తం బైనమంటపంబున నారాత్రి నారాయణు నారాధించి కేశవాయ నమో యని
పాదంబులు దామోదరాయ నమో యని కటీరంబును నృసింహాయ నమో యని
యూరుయుగంబును శ్రీవత్సధారిణే నమో యని యుదరంబును గౌస్తుభధరాయ
నమో యని కంఠంబును శ్రీపతయే నమో యని వక్షంబును త్రైలోక్యవిజయాయ
నమో యని భుజంబులును సర్వాత్మనే నమో యని శిరంబును రథాంగపాణయే
నమో యని చక్రంబును శంఖాయ నమో యని శంఖంబును బద్మాయ నమో యని
పద్మంబును గంభీరాయ నమో యని గదాదండంబును శార్ఙ్గమూర్తయే నమోయని
యభయహస్తంబును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నజలపూరితంబులు
విమలాంబరపరివృతంబులు గంధపుష్పాక్షతసమన్వితంబులు తిలతామ్రపాత్రస్థగితం
బులు నైనకలశంబులు నాలుగు చతుర్వేదంబులు చతుస్సముద్రంబులుగా భావించి
తత్కలశంబులనడుమ హిరణ్మయంబు గాని రజతమయంబు గాని దారుమయంబు
గాని యొక్కప్రతిమ గావించి వస్త్రావృతం బైనపీఠంబు పెట్టవలయు నట్టిపీఠంబు
దొరక దేని సలిలపూర్ణకుంభంబుం గుదురుపఱచి తదుపరిస్థలంబున సువర్ణంబునం జేసిన
మత్స్యప్రతిమ ప్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి దైత్యాంతకా రసాతలగతం
బైనవేదంబులం బోలె సంసారనిమగ్నుండ నైనన న్నుద్ధరింపు మని ప్రార్థించి జా
గరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబున సముచితక్రియాకలాపంబులు
సలిపి పూర్వదక్షిణపశ్చిమోత్తరకలశంబులు ఋగ్యజుస్సామాధర్వణవేదులకుఁ గ్ర
మంబున నిచ్చి తోయపాత్రస్థితకాంచనమీనంబుం గుటుంబి యైనభూసురాగ్రణికి
సమర్పించి తదనంతరంబున.

10


సీ.

పాయసాన్నంబుల బ్రాహ్మణోత్తముల సంతృప్తులఁ గావించి భృత్యవర్గ
సహితుఁడై మౌనంబు సడలక పారణ చేసినసువ్రతశీలుపుణ్య
ఫలము వచింతు నాబ్రహ్మకల్పము సత్యలోకంబునందున నేకసౌఖ్య
మున నుండి జన్మించు వెనుక వైరాజులలోన జగన్నుతశ్లోక యింక