పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చతురాననాదిసురసం, తతినతపదపంకజుండు నారాయణుఁ డే
గతిఁ గొలువ సులభుఁ డగు నా, నతి యీవలె నదియ వరము నాకు మునీంద్రా.

92


గీ.

అనిన విని యేవ్రతం బైనఁ దనుగుఱించి, పరమవిశ్వాసమునఁ బట్ట భక్తులకుఁ బ్ర
సన్నుఁ డగుఁ గాన భక్షింప శకట మనృత, మాడ నని పట్టు వ్రతము శ్రీహరిగుఱించి.

93


క.

అని తపసి తత్పుళిందుఁడు, ధన మడుగక మోక్ష మడుగఁ దలఁచిన నీలా
గున మోసపుచ్చి యేగిన వెనుక నియమపరత నాటవికవల్లభుఁడున్.

94


చ.

గురువుల నాత్మఁ గీల్కొలిపి ఘోరతపోనియమానుషక్తుఁడై
తరుపతితచ్ఛదాశనవిధి న్విహరించుచు దైవికాసరి
త్పరిసరపుణ్యకాననవిభాగమునందు బుభుక్షకుక్షిలో
దరికొన జీర్ణపర్ణములు దా నొకనాఁడు దినంగఁ బోయినన్.

95


క.

నక్షత్రపథసరస్వతి, భక్షింపకు శకట మనుచు భాషించిన నా
వృక్షంబు విడిచి వేఱోక, వృక్షమునకుఁ బోవ నట్ల యెఱిఁగించుటయున్.

96


సీ.

ఆభీలవల్లభుం డఖిలంబు శకటంబకా విచారించి హృత్కమలకర్ణి
కాసీనదేశికధ్యానామృతంబు ప్రాణాధారముగ నిరాహారవృత్తి
నతిఘోరతపము చేయంగ దుర్వాసోమునీంద్రుండు వచ్చిన నెదురుకొని స
సంభ్రమస్వాంతుఁడై చాఁగి యే నెటువంటిభాగ్యవంతుండనో పైతృకంబు
పెట్ట సమకట్టువేళకుఁ బిచ్చుకుంటు, మీఁద భాగీరథియుఁ బోలె మీర లేగు
దెంచితిరి గాన వలయు నాతిథ్య మవధ, రింపు నిస్తంద్రకారుణ్య ఋషివరేణ్య.

97


గీ.

అనిన దూర్వాసుఁ డాత్మలో నవశనవ్ర, తప్రయాసంబుచేఁ గృశత్వమునఁ బొంది
యును మహాబ్రహ్మవర్చసయక్తుఁడైన, యితనితపము పరీక్షింతు నే నటంచు.

98


క.

మును తరుజీర్ణపలాశా, శనుఁడవు నిరశనుఁడ విపుడు శబరాన్వయవ
ర్ధన న నీకు శక్యమే వన, మున మా కభీప్సితాన్నముల దొరకింపన్.

99


క.

పేరాఁకలి గొంటిమి కడు, పార భుజించెదము శాలియవగోధూమా
హారములు పెట్టు మనవుడు, నేరీతి ఘటింతు నితనియీప్సిత మనుచున్.

100


క.

తలఁచుతఱిన్ మందాకిని, బలభిత్కరి సొచ్చి పెఱికి వెచినరక్తో
త్పల మనఁగాఁ జిక్కములో, పల నొకమణిపాత్ర మభ్రపథమున వచ్చెన్.

101


ఉ.

ఆనవరత్నపాత్ర శబరాగ్రణి పాణి ధరించి మ్రొక్కి యి
చ్చో నిలుమయ్య నన్ను దయఁ జూచి బుభుక్షకు నోర్చి తత్త్వవి