పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రార్థించిన విని సహస్రకరుండు సూక్ష్మాకారంబు వహించి భువనపూజ్యుండై
నిలిచె నట్టిభాస్కరుజన్మదివసంబు గాన సప్తమినాడు కథాకర్ణనంబు మున్నుగా
శాకాహరు లైనవారికి నాయురారోగ్యంబులు గలుగు నింక శరీరాధిదేవత లైన
కామక్రోధాదులు మాతృక లగుట వినుము.

105


గీ.

ఆదిమన్వంతరంబున నవతరించి, వారె బ్రహ్మవరప్రభావమునఁ గువల
యంబు గంపింప సాంపరాయస్థలిని ని, రస్తనానాసురుం డంధకాసురుండు.

106


సీ.

ఇట్లు దానవారాజు హెచ్చిన నొచ్చి వియచ్చరవ్రాతంబు వచ్చి తనకు
విన్నవింప నజుండు మున్ను వానికి శరీరంబున వెడలినరక్తకణము
లెన్ని మేదిని రాలె నన్నియు నంధకాసురులుగా నిచ్చితి వరము నేను
గావున మనచేతఁ జావఁడు పురవధూచికురబంధద్రోహిచేతఁ గాని
కదలిపోదము రండని కలుషకదళి, కాసమదభద్రకరికిఁ గైలాసగిరికిఁ
దత్తఱంబున నేగి నెత్తమున నిలిచి, చఱులఁ బ్రతిశబ్దములు పుట్ట మొఱలు వెట్ట.

107


క.

ఆఘోషము బాహముహు, రాఘాతమదాంధకాంధకాసురచాప
జ్యాఘోషము వినియె జయశ్లాఘాదుర్ధరుఁడు హరుఁడు సమసమయమునన్.

108


మ.

విని గీర్వాణులభీతి మానిషి మనోవీథిన్ విచారించి వీఁ
డు నిరాతంకత నెట్టు వచ్చె నగరాట్పుత్రీజిఘృక్షాప్రయో
జనుఁడై కన్నులఁ గానఁ డంచుఁ గొనమీసల్ దీఁడి తా తార్చెన్ భుజం
బున రక్షోవనితాజనాక్షిజనితాంభోజాలమున్ శూలమున్.

109


క.

రణసన్నాహంబున ఫణ, ఘృణిమండలి మెఱయ వాసుకిన్ ధరియించెన్
మణికాంచిగా రణత్కం, కణములుగాఁ దొడిగెఁ దక్షకధనంజయులన్.

110


క.

ఈవిధమునఁ గట్టాయిత, మై వెలువడి నముచిభిన్ముఖామరవరసే
నావీరభద్రగణదం, తావళవదనులు భజింప నడచినశూలిన్.

111


చ.

కనుఁగొని నీలదానవుఁడు గంధగజాకృతి ఘీంకరించి వ
చ్చిన మృగరాజరూపమునఁ జించె నఖంబులఁ గుంభముల్ ఘనా
ఘనఘనగర్భముక్తకరకల్ వలె మౌక్తికరాజి రాలఁగా
ననిమొన వీరభద్రుఁడు భయంకరకంఠనినాదరౌద్రుఁడై.

112


క.

ఆసమయంబున సంస్తుతి, చేసిరి దేవతలు మెచ్చి శివుఁడు తదానీ
తాసురమత్తగజాజిన, వాసము ధరియించి కృత్తివాసుం డయ్యెన్.

113


సీ.

ఇట్లు రుద్రుండు భద్రేభచర్మంబు ధరించి శూలంబు సారించి కవిసె
నంధకాసురుపై సహస్రాక్షశిఖియమరాక్షసాబ్దిపసమీరణక బేర