పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మున్ను గీర్వాణులు మునులు సుధర్మాసభాసీనులై సచరాచరముగ
శిష్టజనంబులు చేయుకృత్యములు నిర్విఘ్నంబులై చాగురీతి దుష్ట
మతులు గావించుకర్మములు నిర్విఘ్నంబులై నడుచుట మాన్పఁగా నుపాయ
మెద్దియో యంచు నూహించి మహోగ్రకల్మషకరిహరికిఁ గైలాసగిరికి
నరిగి పరమేశ్వరునకు సాష్టాంగదండములు సమర్పించి శంకర పురనిశాచ
రావరోధవధూకంఠహారహరణ, కరణచణబాణ ధూర్తులకార్యమునకు
నంతరాయంబు పుట్టింప నవధరింపు.

49


క.

అంచు నుతియించుటయు శివుఁ, డించుకవడి ఱెప్ప వాల్ప నెఱుఁగక యెదుట
జంచలత లేనితొలకరి, చంచలవలె నున్న శైలసంభవఁ జూచెన్.

50


క.

చూచి విసర్జితపరవీ, క్షాచింతకుఁడై తదీయసౌందర్యసరో
వీచికలలోన మునుఁగుచు, లేచుచు నిజహృదయ మనుగలింపఁగ మఱియున్.

51


సీ.

పలుమాఱు సోమరిచలిగాలిసోఁకునఁ గదలెడునీలాలకములు చూచి
తొలుకారుక్రొమ్మెఱుఁగులవంటిరుచులు ముందట వెదచల్లునేత్రములు చూచి
చిన్నారిపొన్నారిచెమటచిత్తడితోడివికచకపోలపాళికలు చూచి
పచ్చికస్తూరికాపంకంబు దాల్చి క్రిక్కిఱిసినగుబ్బపాలిండ్లు చూచి
కౌను చూడంగ నాత్మ నాకసము దోఁప, వాయుతేజోంబుభూమితత్వములు నాల్గు
మూర్తులు వహించి మింటికి మూర్తిలేమి, యేమి కారణ మనుచు నూహించి నవ్వె.

52


గీ.

శంభుఁ డీచందమున జ్ఞానశక్తియైన నగతనూభవఁ జూచుట నభము సంస్మ
రించుట నగుట మూర్తీభవించు మంచు, నలువ మును పల్కుటయుఁ గారణములు గాఁగ.

53


క.

క్షితిజలతేజోమారుత, పతి తద్గగనము జనించెం బరమేశ్వరసం
స్మితముఖమున సకలగుణా, న్వితమూర్తి వహించి చక్కనికుమారుండై.

54


క.

ఈరీతి నుదయ మైనకు, మారునకు సహస్రకోటిమన్మథసదృశా
కారునకు వలచి సభలో, గౌరీసేవానుయాతఖచరపురంధ్రుల్.

55


క.

నిలిచిరి నివ్వెఱపడి వెల, వెలనై క్రొమ్మొలకచెమట వెడలఁ దదీయో
జ్జ్వలకాంతిచంద్రికలలో, పల హిమకరకాంతరత్నపాంచాలికలై.

56


క.

అతని సదాశివమూర్తి, ప్రతిమానవిలాసు వేడ్క పడి పరమపతి
వ్రతలకు నగ్రేసర పా, ర్వతి సైతము కంటిఱెప్ప వాల్పక చూచెన్.

57


ఉ.

ఆసమయంబున మనసిజారి లలాటతటీనటీభవ
ద్భ్రూసముదగ్రుఁడై తనసుతుం గడకన్నులు జేవురింపఁగా