Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxiii


దశరథుఁడు చనిపోయిన పిమ్మట భరతుఁడు వసిష్ఠ ప్రముఖులైన ద్విజులచే రాజ్యపాలనము కొఱకు నియోగింపఁబడిన వాడయ్యెనని దీని భావము.


'శరభంగం దదర్శహ' “సుతీక్ష్ణం చాప్యగస్త్యంచ . అగస్త్య
భ్రాతరం తథా”

దండకారణ్య ప్రవేశానంతరము రాముడు : (1) శరభంగుని (2) సుతీష్ణుని (3) అగస్త్యుని (4) అగస్త్యభ్రాతను జూచెనని పై వాక్యముల యర్థము. పై నలుగురును మహర్షులు. ఇంతేకాక -


అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం
ఖడ్గంచ పరమ ప్రీత స్తూణీచాక్షయ సాయకౌ”

అగస్త్యుని మాటప్రకారము రాముఁడింద్ర సంబంధియైన చాపమును ఒక ఖడ్గమును అక్షయ సాయకములైన రెండమ్ముల పొదులను దీసికొనెనట.

మఱి కొందఱు ఋషులువచ్చి యసురులయొక్కయు రాక్షసుల యొక్కయు సంహారముకొఱకు బ్రార్థింపగా రాముడు రాక్షసులఁ జంపుదునని ప్రతిజ్ఞ గావించెనట.

ఆ కాలమున రాక్షసబాధ ఋషుల కెక్కుడుగా నున్నదని వీనిచే గ్రహింపవచ్చును.

ఇవియన్నియు నట్లుండనిచ్చి వసిష్ఠ భరద్వాజుల కాలముకు గూర్చి చర్చించి చూతము.