పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

65


దారుల్ తొంటి భవంబునన్ శమసముద్యచ్చిత్తులై వచ్చి నీ
వారిం గ్రుంకిన వారి వారలఁట కా వార్ధి ప్రియంభావుకా.

38


శా.

రేపుల్దామరచూలిచందమున సంక్రీడించి మధ్యాహ్నవే
ళాపూర్తిం గనకావనీధరధనుర్లాలిత్యము ల్చూపి తా
మాపు ల్మాధవలీలల న్వెలయు నమ్మూర్తాండుఁ డోయమ్మ ని
న్నేపుణ్యంబునఁ గాంచెనో యతనిపెం పిం కేమనం బావనీ.

39


లయగ్రాహి.

జాలుకొనిమించు నెఱ డాలు గలజాతి హరి
                       నీలముల నేలుకొనఁజాలెడు భవత్క
ల్లోలములు భక్తజనలోలములు పాపవన
                       కీలములు మోక్షపదమూలముల తత్త
ద్బాలిశజనప్రకరఫాలతలపద్మజస
                       మాలిఖితదుష్టలిపితూలపటలీవా
తూలములు పుణ్యగుణశీలములు సంస్తవన
                       కేళి పరతంత్రములు లీల నుతియింపన్.

40


వ.

ఇట్లు బహువిధంబుల నమ్మహానది నభినందించి కృతస్నానుండై సమా
కుంచితపంచేంద్రియుం డగుచుఁ బంచాగ్నిమధ్యంబున నిలిచి హరిని
గురించి తపం బాచరించుతఱి నొక్కనాఁడు.

41


సీ.

పుష్పవతీనామపుటభేదనం బేలు
                       నందకాఖ్యానగంధర్వనృపతి
గారాపుఁగూతురు కామునిరాచిల్క
                       లతయను పేరి బాలయు మహేంద్ర
నగరాధినాయకుం డగు చిత్రవాహనా
                       హ్వయమునఁ బరగెడు యక్షభర్త
కనుఁగుఁదనూభవ కనకమంజరి యను
                       కన్నియ జలకేళికాకుతూహ