పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

117


క.

మును మాయాశ్రమమునకును
జననాయక నీవు వచ్చి సంతుష్టుఁడవై
చను మే లెఱుఁగుదువో యని
మన మరయ దలంచి యొక్కమార్గముచేతన్.

50


చ.

ధనములు చోరవృత్తిఁ గొన దగ్గరకిం దలవర్లు దెచ్చినన్
ననుఁ గని నీవు చాలకఠినంబులు పల్కితి మున్నెఱింగియున్
మనుజవరేణ్య! యట్టియవమానమువల్ల కృతఘ్నదోషముల్
పెనఁగొని వెఱ్ఱిజేసె నిక భీతిల కేగతి యొండు దెల్పెదన్.

51


గీ.

అకటబ్రాహ్మణఁ డుపకర్త యనఁగవలదు
భూసురుండైనవాఁ డెల్ల పూజ్యు డరయ
నవనినాయక! యుపకర్తయైనయట్టి
విప్రు నవమతి సేసిన వేఱెకాదె.

52


సీ.

చతురంగబలములై సంరక్షణము సేయు
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు
ధనధాన్యరాసులై తనుపు సంతతమును
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు
ప్రాకారము లగాధపరిఘులునై కాచు
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు
ప్రాసాదములు రత్నభవనంబులై యుండు
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు


గీ.

బ్రాహ్మణులఁ బూజసేసి సద్భక్తితోడ
నన్నపానాదు లొనగూర్చు నవనినేత
యాయురారోగ్యభాగ్యంబు లనుభవించు
సత్య మిదె సుమ్ము నమ్ము నాసత్యరూప.