పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

శ్రీరాజగోపాలవిలాసము


గీ.

కుండలితచాపుఁడై నృపకుంజరుండు
నిశితశరములు నొండొండ నిగుడఁజేసి
ఘోణిఘ్రాణపుటంబున గుదులు గ్రుచ్చె
పొదలచున్నట్టి వాలంపుపొదు లనంగ.

37


వ.

మరియు నమ్మహీమండలాఖండలుండు మండలీకృత చండ
కోదండుండై యొండొండ నిశతకాండంబుల నించి చించి
చెండాడు చండగవిసిన చందంబునం దమకంబు వీడ క్రోడంబు
తత్తరంబునం బరువెత్తిన హత్తికత్తళాధాటింపుచు, వెంబడిం
బడి మిట్టాడు మానిసి లేనినట్టడవి మలపం యెదదప్పిచే నలపం
.................బ్రాణత్రాణపరాయణుండగును నాచక్కినొక్క
యాశ్రమంబు శ్రమంబు దీరునను తలంపునందుఁ బ్రవేశించి
యందునయజ్ఞయజ్ఞశీలుం గనుంగొని నమస్కరించి "అయ్యా
యియ్యడవి నెయ్యడలం దేరుగడలు దీపించె నన్ను నన్నంబు
వెట్టి రక్షింపుమ న్నతం డన్నపానాదుల నన్నరవరుం బరితృ
ప్తుం జేసి యనిచిన ననిచినముదంబున నమ్మహీకాంతుండు
నిజపురంబు ప్రవేశించె నంత నొక్కనాడు.

38


క.

మునినాథుఁడు డెందంబున
జననాధుకృతజ్ఞభావసంగతిఁ దెలియన్
జనుదెంచెను శౌర్యంబున
మునిముచ్చనుమాట లోకమునఁ దనరారన్.

39


ఉ.

వచ్చి మహీమహేంద్రు తలవాఁకిటి మోసలనుండి చీకటుల్
హెచ్చినవేళ నందునను నెవ్వరు గానకయుండ నేర్పుగా