పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలుఁ డేటికి వచ్చె కడునాఁడె ప్రతిన, యే నేమి బలుకుదు నే మందు నింక
నట్టితమ్మునిమీఁద నలుగంగ మనసు, నెట్టకో నా కంచు నిట్టూర్పుఁ బుచ్చి
సంతాపమొంద నాసౌమిత్రి జూచి, ..................................................
నాకొఱ కేచింత నరనాథ వలదు, నీ విట ధర్మంబు నెరపంగవలయు
నేకాల మెవ్వరి కెయ్యది ప్రాప్త, మాకాల మతనికి నది గాకపోదు
దేవ నన్ విడిచి ప్రతిజ్ఞఁ బాలింపు, నావెంట ధర్మంబు నడుపకయున్న
నరకంబు బాపించు న న్నట్లుఁగాన, గరుణించు దుర్గతి గాకుండఁజేయు
మని తెంపుగాఁ బల్కి ననుజుమాటలకు, తనలోనఁ బొగులుచుఁ దలపోసి చూచి

శ్రీరామచంద్రుఁడు వసిష్ఠాదులతో కాలునివృత్తాంతమును, దూర్వాసుని యాగమనమును జెప్పుట

యనఘు వసిష్ఠుని యఖిలార్ధవిదుల, జననాయకుల మంత్రిజనుల రప్పించి
వారితోఁ గాలుఁడు వచ్చినపనియు, నారయ నతనితో నాడినప్రతిన
యప్పుడు దూర్వాసుఁ డరుగుదెంచుటయుఁ, జెప్పిన విని యావసిష్ఠుండుఁ బలికె
ననఘాత్మ సత్యవాక్యము విచారింపు, మనుజుఁడు సౌమిత్రి యని విచారించి
విడువఁజాలకయున్న విధమెల్లఁ గాన, బడియెడు నీమనఃపరితాప మరయ
నిర్మలమౌ గాలనియతి చింతించి, ధర్మంబు నిక్కంబు దక్కెల్లఁ బోయి
గైకొన్న పలుకవు గావింపకున్న, కాకుత్స్థధర్మంబు కడతేరిపోవు
సుచరిత్ర ధర్మంబు శూన్యమైనపుడు, సచరాచరము లైన జగములు గ్రుంగు
జగములుఁ బొలియంగ సౌమిత్రి యేల, జగదీశ విడువుము సత్యంబు పూని
తనవాక్యనిష్ఠకై దశరథేశ్వరుఁడు, నినుఁ బుచ్చఁడే మున్ను నిష్ఠురాటవికి
యది గాన సౌమిత్రి నవనీశ విడిచి, పదిలుండవై కీర్తిఁ బాలింపు మనిన
నావాక్యములు విని యాస్థానమెల్ల, దైవంబు దూరగఁ ధైర్యంబు నూని
నీయట్టియుత్తము నిర్మలాచారు, నేయెగ్గు వచ్చిన నేఁ జంపఁజాల
ననఘాత్ములకుఁ బరిత్యాగంబు చావు, నిను నేఁడు విడిచితి నీ వేగు మనిన
నడలుచు సౌమిత్రి యన్నపాదముల బడిన సభాసదుల్ పార్ధివేశ్వరుఁడు

లక్ష్మణుని నిర్యాణము

తనుఁ జూచి యెడల నాస్థానంబు వెడల, చని కృతస్నానుఁడై సరయువునందు
వినుతనిశ్చలయోగవిజ్ఞానదృష్టి, తనపూర్వభాగంబు తగిలి గైకొనిన