పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంత నాయాగంబునందు శంకరుఁడు, సంతుష్ఠుఁడై మునిసంఘంబుఁ జూచి
మునులార భక్తితో ముద మొప్ప నాకు, ననఘులై చేసిన యశ్వమేధమున
బ్రీతుఁడ నైతి నేఁ బ్రియమార నిలుప, కేతేఱఁ గొసగుదు నెఱిగింపు డనిన
నవుగాక యని పల్కె భవుండు నంత, సకలంబు దీర్చి నిజాశ్రమంబులకు
మునులు కర్దముఁడును ముదమార నేగి, ననురాగమును బొంది యంత నాయిలుఁడు,
బుధుని వీట్కొని తనపురి కేగి రాజ్య, మధికసమ్ముదమున నరసి పాలించి
యమరలోకమునకు నరిగె నావెనుక, నమరఁ బురూరవుం డందు రా జయ్యె
నటు గాన నశ్వమేధాధ్వరమహిమ, యిటువంటిదని చెప్ప నెవ్వరితరము

శ్రీరాముఁ డశ్వమేధయాగంబు సేయుట

యేమి గావించిన నెలమి సిద్ధించు, నీమఖం బటుగాన యేను గావింతు
సౌమిత్రి వెస నీవు చని వసిష్ఠులకు, వామదేవుండును వరతపోమహిమ
మొదవిన జాబాలియును కశ్యపుఁడును, మొదలుగాఁ గలిగిన మునివరేణ్యులకు
వినుతవర్తనులైన విప్రవర్యులకు, మనయత్న మెఱిగించి మానుగాఁ దెమ్ము
యనవుఁడు లక్ష్మణుం డన్నిచోట్లకును, జని మహామునులను సకలభూసురుల
గొనరాక విని రఘుక్షోణీవిభుండు, మనమార నాస్థానమంటపఁబునకు
నేతెంచి వారికి నియతితో మ్రొక్కి, యాతిథ్య మొనరించి యర్థితోఁ బలికె
మీయనుమతి నశ్వమేధయాగంబు, సేయుదు ననుచు జింతించినాఁడ
నానతి యిండన్న నఖిలసంయములు, మానుగా నీవు నీమఖము చింతించి
శాశ్వతధర్మైకసారమైయున్న, నశ్వమేధము సేయ నగునేని యొకటి
వినుము చెప్పెదము యుర్వీనాథ పత్ని, యును లేక నది సేయ యుక్తంబు గాదు
సకలజంతువులకు సమ్మదం బలర, సకలధర్మములకు సాధ్విచేయూత
కావున నిహపరకార్యాధికార, మేవెంట నొనఁగూడ దింతియు లేక
నటుఁగాన కాలోచితాధ్వరక్రియకు, కుటిలకుంతల నర్ధి గోరి వివాహ
మగుటయు నదగునన్న నారాముఁ డాత్మ, వగ బొంది యవనతవదనుఁడై యున్న
తరి వసిష్ఠుఁడు వచ్చి ధరణీశుఁ డున్న, తెఱఁగంతయును జూచి తెలియఁగ ననియె.
నీవు విశ్వకుటుంఓబి వెన్నంగ నాత్మ, భావింప మానుషభంగియే దేవ
యారయ నవతారమై కంటకులకు, వారక శిక్షింపువాఁడవై పుడమి
కాకుత్స్థకులదీపకరుఁడవై యిట్లు, ..........................................