పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురుషుఁ డెవ్వఁడొ పువ్వుబోణికి నరయ, వరుఁడు లేకున్న నీవామాక్షి నాకు
నాలుగాఁ దగునంచు నచ్చోటతపము, చాలించి తనపర్ణశాలకు వచ్చి
నలువార నిలయొద్ద నలినలోచనులు, పిలిపించి మ్రొక్కిన బ్రియమారఁ బలికె
మృగవిలోచనలార మీరెల్లఁ గొలువ, జగదేకనతమైన సౌభాగ్య మలర
బిగిచన్నుగవయును ప్రధునితంబమును, గగనసోయగమునా కడునొప్పునడుము
నగ బల్క నేర్చిన నవపద్మ మనఁగ, జిగియగు నెమ్మోము చిగురుమోవియును
యలినీలవేణియు నమర మీతోఁడ, జలజనాళంబును జరచి నవ్వుచును
చెంగల్వ వెలుపలిచెవి జెవి కొన్న, యంగన యెవ్వతె యానితంబినికి
వరుఁ డెవ్వ డేటికి వచ్చె నిచ్చోటి, కిరవంద మీరు మా కెరుగింపు డనిన
ననఘ మాయొడయ రాలగృహీతహస్త, వనితలతో నాఁడ వచ్చినా నలరి
యావార్త వినియు విద్యావిశేషమున, నావిధంబంతయు నాత్మలో నెఱిగి
పొలుపార నాయాజ్ఞఁ బూని కింపురుషు, లలరుచునున్నవా రధికతేజమున
వారికి పత్నులై వర్తింపుఁడనుచు, నారయ మతి బల్క నచ్చెల్వ లలరి
కింపురుషులతోఁడ గ్రీడింపుచుండిఁ రింపార బుధుఁడును నిలఁ జేరబోయి
సుభగి యే చంద్రుని సుతుఁ డైనబుధుఁడ, నభిలాష నీమీఁద నధికంబు నాకు
కాముబాణంబుల కడుదూలి నిన్ను, కామించి తింకపై గైకొనుమనిన
ననఘాత్మ నీకోరినట్ల సేయుదును, ననవుఁడు నిలతోడ నాసోమసుతుఁడు
క్రీడమై నిచ్చట గిరిగుహాంతరముల, కూడియు పొదరిండ్ల కోర్కులు సలుప
మక్కువ నొక్కనిమిషమై యేగె నిలకు .............................................
పరగ నిట్లానిల పరిపూర్ణమైన, పురుషుఁడై మేల్కని పొలుపార వచ్చి
యాసరోవరమున నంతరిక్షమున, భాసురగతి నూర్ధ్వబాహుఁడై తపము
సేయ౦గ బుధుఁ గాంచి సేనతోఁ గూడ, నీయరణ్యమునకు నే వచ్చినాఁడ
నది యెందు బోయెనో నాసేన గాన, విదితంబుగాఁ జెప్పవే నాకు ననిన
సైరింపు మిలుఁడ యాసంతాప ముడుగు, భూరిశిలావృష్టి బొలిసె నీసేన
గాలిచే వానచే కడుడస్సి నీవు, మేలుగా నిద్దరమైనుండి యిపుడు
యనఘాత్మ యిట్లౌట కాత్మ జింతింప, పని యేమి నీవు నీపట్టణంబుకకు
ననురాగమున నేగి యర్ధితో రాజ్య, మనుపమంబున జేయ నర్ధింపుమనిన
సేన గోల్పడిపోయి సేయు నారాజ్య, మే నొల్ల నిఁక జాలు నెన్నిభంగులను
గైకొని యిందుశేఖరుఁగూర్చి తపము, నీకతంబున నేను నెరపెద నిచట