పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంత దండునిదేశ మడవియై యుండె, నంతనుండియు దండకారణ్య మయ్యె
నృపవర జనులందు నెంతయు ఘోర, తపము సేయుట జనస్థానంబు నండ్రు
వడి శుక్రుశాపంబువలన బ్రాణులకు, సుడియ రాకట ప్రాణిశూన్యమై యుండె
నని చెప్ప దిననాథుఁ డస్తాద్రి కరిగె, జననాథ మునులెల్ల జనుచున్నవారు
సాయంతనములైన శౌచకర్మములు, సేయంగ నియమంబు చెల్లించి నీవు
వత్తుగా కనుఁడు నవ్వశుధీశుఁ డరిగి, యత్తెరంగంతయు నట తీర్చి వచ్చి
మ్రొక్కిన దీవించి మునినాథుఁ డలరి, పెక్కుతెఱంగులఁ బ్రియపూర్వకముగ
నమృతాయితములైన యన్నపానాదు, లమరంగ నిడుటయు నవి యారగించి
యారాత్రి వేగియు నరుణకాలమున, గౌరవంబున నిత్యకర్మముల్ దీర్చి

శ్రీరాముఁ డగస్త్యునిచే సమ్మానితుఁడై యయోధ్య కేతెంచుట

చనుదెంచి భక్తి నాసంయమీంద్రునకు, వినతుఁడై హస్తారవిందముల్ మొగిచి
తాపసోత్తమ యేను ధన్యుండ నైతి, మీపుణ్యదృష్టి నామీఁద రాగంటి
పురమున కే నింకఁ బోయెదనన్న, గురుదయాబుద్ధి నాకుంభజుం డనియె
నేవిమలులు నిన్ను నిష్ఠభావమున, భావింతు రాఘనుల్ పరమపావనులు
పుణ్యలోకములందుఁ బూజ్యులు నగ్ర, గణ్యులునని దేవగణము గీర్తించు
నెవ్వరు మదిలోన నీసున నినుఁ, గ్రొవ్వి చూచిరి వారు ఘోరరూపమున
నలుకతోఁ గదిసిన యమదండనిహతి, ........................................
నవనికూలుదు రోలి నరకకూపమున, నెవ్వరు నీనామ మెలమిఁ గీర్తింతు
రెవ్వరు నీమూర్తి హృదయంబులోన, .............................................
నేకక్షణం బైన నీక్షింతు రెవ్వ, రేకార్యము నిన్ను నెందు నేమందు
నెరయ ధన్యులు వారు నిచ్చలు వారి, యరచేతిలోనివి యిఖిలపుణ్యములు
చెన్నొంద నీపేరు జిహ్వాగ్రవీథి, నున్నప్రాణులకెల్ల నూర్ధ్వలోకంబు
గలదన్న పరమభాగవతోక్తులకుఁ, గలుగుట యది యెంత కాకుత్స్థతిలక
ధర్మకర్మంబున ధరణిఁ బాలింపు, నిర్మలకీర్తిచే నిత్యుండ వగుము
యనఘాత్మ పోయిరమ్మని వీడుకొలుప, మునిపుంగవుల కెల్ల మ్రొక్క వా రనుప
వారల మగుడించి వచ్చి పుష్పకము, నారోహణము చేసి యధికవేగమున
మనుజాధినాథుండు మధ్యాహ్నమునకు, తనరువేడుక నయోధ్యకు నేగుదెంచి
నగరిలో నుచితాంగణమునఁ బుష్పకము, డిగి దాని బొమ్మన డిండిమధ్వనులు