పుట:మార్కండేయపురాణము (మారన).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాలయ మెల్లఁ ద్రిమ్మరుచు నాయతు లన్నియుఁ గొంచు రాజు పె
న్మాలతనంబు నొందెఁ గొఱమాలినదైవముచెయ్ది నక్కటా!

237


సీ.

ప్రాణంబుతోడ జన్మాంతరంబును బొందె నిట్లు హరిశ్చంద్రుఁ డేమి చెప్పఁ?
బీనుంగులకుఁ బెట్టుపిండము ల్గుడుచుచు మేదోవసామాంసమిళితపంక
ముల నెప్పుడును బ్రుంగు చొలికి బూడిదలలోఁ బొరలుచుఁ గట్టినబొంత గప్పు
చొడలిదుర్గంధంబు సుడియంగ వడిని జుగుప్ప రూపంబు గైకొన్నమాడ్కి


ఆ.

సతీనికృష్టవృత్తి నార్తుఁడై సుతసతీ, సుహృదమాత్యబంధుసుఖవియోగ
వేదనానలమున వేఁగుచు నమ్మెయి, నుండ నెలలు పదియు రెండు నిండె.

238

హరిశ్చంద్రుఁడు శ్మశానమునఁ గల గాంచుట

వ.

అంత నొక్కనాఁ డమ్మహీపతి పరేతనికేతనంబున నిద్రించి యత్యద్భుతంబైన కలఁ
గాంచె నెట్లనినఁ దాను జండాలికాగర్భంబున నుద్భవించి సప్తవర్షవయస్కుండై
యొక్కశ్మశానంబున మృతసంస్కారమాల్యాహరణాధికారంబున నుండం గొందఱు
విప్ర లొక్కశవంబు గొనివచ్చి దహనవేతనంబునకై తనచేతం బరాభూతి నొంది
కోపించి ఘోరనరకంబునం బడు మని శపించిన నప్పుడు కాలకింకరులు దన్నుం
బట్టుకొనిపోయి తప్తసికతానలప్రదేశంబుల నడిచియుఁ బొడిచియుఁ గాల్చియుఁ
బ్రేల్చియుఁ గండలు గోసియు నూనియ నుడికించియుఁ బురీషకూపంబుల ముంచియు
ననేకక్రూరదండంబులు దండింపం బూయశోణితంబులు ద్రావుచు నొక్కొక్క
దినంబు శతవత్సరంబులుగా వత్సరద్వయం బధికదుఃఖంబు లనుభవించి నారకభవో
త్సార్యమాణుండై క్రమ్మఱ మహీతలంబునం బడి ఖర శునక హస్తి వానర చ్ఛాగ
బిడాల కంక గృధ్ర మత్స్య కూర్యాదినానాకుయోనులం బుట్టి సార్ధహాయనంబు
తీవ్రవేదనలపాలై యెప్పటిరాజస్థితి వడసి జూదంబున నాలిని గొడుకును
రాజ్యంబును గోలుపడి యేకాకియై యడవుల కరిగి సింహంబుబారిం బాఱి శర
భంబుచేత రక్షితుఁడై దానిచేత నతిపీడితుం డగుచు భార్యానందనులం దలంచి
వందురితిరుగుచు నొక్కయెడ నయ్యిరువురుఁ దమ్ము రక్షింపుమని తన్నుం బేర్కొని
పిలుచునెలుంగులు విని డాయం బోయి వారలం గానక పరిభ్రమించుచుండం బది
యేనుదివసంబులు గొఱంతగాఁ బండ్రెండేఁడులు నిండినతఱి విశ్వామిత్రుచే నంత
వృత్తాంతంబు నెఱింగి జముండు తనకడకు రప్పించి యిది యెల్లఁ గౌశికరోషంబున
నయ్యె దానం జేసి భవన్నందనుండు మృత్యుగతుం డగుం బదంపడి పరమశుభంబు
గలుగు దుఃఖశేషంబు గుడువ మనుష్యలోకంబునకుఁ బొ మ్మని త్రోపించిన నంతరిక్షం
బున నుండి నేలంగూలినవాఁడై బిట్టు మేల్కాంచి.

239


క.

కడుభీతియు బెగ్గలమును, నడరఁగ నిది యొక్కకల మహాద్భుత మేని
య్యిడుమలు పండ్రెండేఁడులు, పడితినొ! కలయో! నిజంబొ! భ్రమయో! యకటా!

240


క.

ఈదుఃఖము సుఖ మయ్యెడు, నాదుఃఖములకును నగ్గ మైతిమి విధిచే