పుట:మార్కండేయపురాణము (మారన).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

మార్కండేయపురాణము

సప్తమాశ్వాసము


విభ్రాజితవైశ్రవ
ణావాసస్పర్ధినిజగృహామితవిభవా!
భావస్ఫురితభవానీ
శ్రీవనితాధీశ! గన్నసేనాధీశా!

1


వ.

పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కిట్లనియె మఱియు మార్కండేయుండు
గోష్టుకితోడ.

2

దక్షసావర్ణిమన్వాదివర్ణనము

ఆ.

మునివరేణ్య! దక్షతనయుండు సావర్ణి, యనునతండు నవమమనువు గాఁగ
నతని కాలమునను నమరులు నింద్రుండు, మునులు నృపులు నెవ్వ రనిన వినుము.

3


వ.

పౌరులు మరీచిగర్భులు సుధర్ములు నన నొక్కొక్కగణంబు పన్నిద్దఱేసిగా దేవ
తలు మూఁడుగణంబులై వర్తిల్లుదురు కార్తికేయుం డగుషడాననుఁ డింద్ర
చిహ్నంబులతో నద్భుతుం డనునామంబున దేవేంద్రుండగు మేధాతిథి వసువు
సత్యుఁడు జ్యోతిష్మంతుఁడు ద్యుతిమంతుఁడు సవనుఁడు హవ్యవాహనుండు నను
వారు సప్తమును లగుదురు ధృతకేతుండును ధృష్టకేతుండు పంచహస్తుండు నిరా
మయుండు పృథుశ్రవుం డర్చిష్మంతుండు భూరిద్యుమ్నుండు బృహద్భయుండు
ననుమనుపుత్రులు రాజులై వర్తిల్లుదు రని చెప్పి మఱియును.

4


సీ.

పదియవమను వైనబ్రహ్మసావర్ణినాఁ డమరులు వినుము సుఖాసనులు ని
రుద్ధు లనంగ నూర్వురు నూర్వు రొక్కొక్కగణము నై వర్తింపఁగలరు శాంతి
యను నాతఁ డింద్రుండు మును లేడ్వురును హవిష్మంతుఁ డాపోమూర్తి సత్యుఁ డొగి న
యప్రతిముఁడు వసిష్టాఖ్యుఁడు సుకృతి నాభాగుఁడు మఱి మనుప్రభవు లైన


తే.

మనుజపతులు భూరిద్యుమ్నుఁడును జయద్ర, థుండు వృషభుండు నుత్తమౌజుండును నన