పుట:మార్కండేయపురాణము (మారన).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాకారభూరిశౌర్యంబుల రక్తబీజునియట్టిదనుజులు ఘనులు పుట్టి
మాతృగణంబుతో మహితహేతివ్రాతసంపాతభీషణసమరకేలి


తే.

సేయ మఱియును దనుజునిశిరము వజ్ర, హతముగా నైంద్రి యేయుడు నగ్గలముగ
నెత్తు రొలికిన రక్కసిమొత్తములు స, హస్రసంఖ్యము లం దుదయంబు లయ్యె.

179


వ.

అయినం గని కోపించి యొక్కట నురవడించి.

180


సీ.

ఆరక్తబీజుఁ జక్రాహతి నొంచె వైష్ణవి యపు డైంద్రి వజ్రమున నేసె
బ్రహ్మాణి నొప్పించె బ్రహ్మదండమ్మున నలి గాఁగ గద మోఁదె నారసింహి
మనశక్తి భిన్నాంగుఁ గావించెఁ గౌమారి లీల మాహేశ్వరి శూలదళిత
వక్షుని గాఁ జేసె వారాహి ఖడ్గతాడితుఁ గా నొనర్చె నద్దితిజుఁ డించు


తే.

కయుఁ జలింపక పటుగదాఘాతమున ర, యమున నొప్పించి యందఱ నార్చి పేర్చె
మాతృగణము సక్రోధమై మఱియు వాని, పైఁ ద్రిశూలశక్త్యాదులు పఱపుటయును.

181


ఉ.

రక్కసుభూరిదేహమున రక్తకణౌఘము గ్రమ్మి చూడఁగా
నక్కజ మై ధరం దొరిఁగె నందు జనించి యనేకదైత్యు లే
దిక్కునఁ దార యై జగము దీటుకొనం గడు నిండఁ బర్విన
న్వెక్కస మంది యెంతయును విహ్వలు లైరి నిలింపు లందఱున్.

182


వ.

అట్లు విషణ్ణు లగునమరుల నాలోకించి యాచండిక మహాకాళితో దేవీ! నీవు
వదనంబు విస్తీర్ణంబు గావించి మదీయశస్త్రపాతసంభూతం బగు రక్తబీజదైతేయ
తంబునల్ల రయంబున భక్షింపు మీరాక్షసుం డంతం బరిక్షీణశోణితుం డై
సంక్షయంబునొందు నని చెప్పి యప్పరమేశ్వరి త్రిశూలంబున నయ్యాభీలదానవుం
బొడిచినం దదంగంబునం గీలాలపూరంబు దొరంగినం గోపించి వాఁడునుం గదా
దండంబునం గదిసి వ్రేసినఁ జండికకు వేదనఁ జేయం జాల దయ్యె నప్పుడు.

183


లయగ్రాహి.

స్థూలతను కాళిమ విశాలలయకాలఘన
             నీలరుచిజాలముల నాలిగొన నేత్ర
జ్వాలలను శూలకరవాలఘృణిమాలికలు
             నోలిఁ దనమ్రోల శిఖపోలిక వెలుంగన్
దూలి పదతాలహతిఁ జాల దీవి గూలఁ గడు
             వాలి మదలీల నవలీల విగళత్కీ
లాల మొగిఁ గ్రోలుచుఁ గరాలగతిఁ గ్రాలుచును
             గాళి దనుజాళి వెసనాలమున మ్రింగెన్.

184


ఉ.

కాళి కరాళ మైనముఖగహ్వరము న్గడు విచ్చి యిట్టు లా
భీలత రక్తబీజుమెయిఁ బెల్లుగఁ గ్రమ్మినరక్త మంతయు