పుట:మార్కండేయపురాణము (మారన).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనుచు ననేకప్రకారంబుల ననిమిషు లభినందించుచున్నంత.

135

కౌశికి గౌరీకాయకోశమునుండి యావిర్భవించి గౌర్యాజ్ఞచే హిమవంతమున కేఁగుట

క.

స్నానార్థము పార్వతి గం, గానదికి న్వెడలి సురలఁ గనుఁగొని మీచే
మానుగఁ బొగడఁగఁ బడియెడు, నానెలఁతుక యెవ్వ రిచట ననియె నరేంద్రా!

136


తే.

అనుడు నద్దేవితనుకోశమున జనించి, యప్పు డొకదేవి సురలతో ననియె సురలు!
నన్ను వినుతించెదరు శరణంబుఁ జొచ్చి, యుగ్రశుంభనిశుంభుల నోర్వ లేక.

137


వ.

అనియె నప్పార్వతిశరీరకోశంబున సముద్భూత యగుట నయ్యంబిక కౌశికి యను
పేరం బ్రఖ్యాత యయ్యె నప్పుడు గౌరియుం గృష్ణయై కాళికాభిధానంబున
హిమాచలంబున నెలకొనియె నంత.

138

హిమవత్పర్వతంబునఁ జండముండులు దేవిం గాంచుట

తే.

ఘనులు శుంభనిశుంభులయనుచరులు ప్ర, చండబలశౌర్యధుర్యులు చండముండు
లతిమనోహరాకారసమగ్రదివ్య, తేజముల నొప్పుకౌశికీదేవిఁ గాంచి

139

శుంభునియొద్ద జండముండులదుర్మంత్రము

మ.

చని శుంభుం గని మ్రొక్కి దేవ! హిమవచ్ఛైలంబునం దొక్కచం
ద్రనిభాస్యం గనుఁగొంటి మామహితసౌందర్యంబు నాకాంతిసొం
పును నావిభ్రమభంగియుం గలుగునే పూఁబోఁడులం దెందు? నా
వనితారత్నము చూడ నీక తగు భాస్వల్లీలమై దేవిగాన్.

140


వ.

త్రిలోకంబులం గలగజతురంగాదిసకలరత్నంబులకును నీగృహం బాకరంబు గాదె
పురందరువలన నై రావణోచ్చైఃశ్రవఃపారిజాతంబులును బ్రహ్మవలన హంసయుక్తం
బగుదివ్యవిమానంబును గుబేరువలన మహాపద్మనిధియును నబ్దివలన నమ్లానకమల
మాలికయు వరుణునివలనం గాంచనదండం బగుమహనీయచ్ఛత్త్రంబును బ్రజా
పతివలన రథోత్తమంబును మృత్యువువలన నుతాంతిద యనుశక్తియు నగ్ని
వలన నీలకౌశేయవసనంబులు నాదిగాఁ గలసమస్తవస్తురత్నంబులును బరాక్రమ
బునం బురుషరత్నంబవైననీ వాక్రమించుటకు మెఱుంగు వెట్టిన ట్లుండు నీస్త్రీ
రత్నంబు పరిగ్రహింపు మని చెప్పినఁ జండముండాసురులవచనంబులు విని శుం
భుండు సుగ్రీవుం డనుదూతం బిలిచి నీ వద్దేవికడ కరిగి యది యెట్లు ప్రీతచిత్త యై
చనుదెంచు నట్లు నాపలుకులుగాఁ జెప్పి తోడ్కొని రమ్మని పంపిన మహాప్రసాదం
బని వాఁడు హిమవంతంబునకుం బోయి యక్కౌశికిం గని మధురవాక్యంబుల
నిట్లనియె.

141

దేవియెదుట సుగ్రీవుఁ డనుకుంభదూత చెప్పినరాయబారము

శా.

దేవీ! శుంభునిదూత నే నతఁడు పుత్తెంచె న్నినుం గోరి బా
హావీర్యోత్కటశౌర్యనిర్జితసమస్తాదిత్యదిక్పాలచూ