ప్రస్తావన
ఈమార్కండేయపురాణము వ్రాసినకవి మారన. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు తిక్కనామాత్యునికుమారుఁడు ఉభయకవిమిత్రుఁడు కవిచూడామణి యగు తిక్కనసోమయాజిశిష్యుఁడు తనమార్కండేయపురాణము నీకవివర్యుఁడు కాకతీయవంశభూషణుఁ డగు ప్రతాపరుద్రచక్రవర్తియొద్ద సేనాని యగుగన్నయ్యకుఁ గృతియొసంగెను. ఈగన్నయ నియోగి యనియు, రామాయణము మడికి సింగనవలనఁ గృతినొందిన కందనమంత్రికిఁ దాత యనియు, రావుబహదూరు వీరేశలింగము పంతులుగారు కవులచరిత్రమున వ్రాసియున్నారు చిలుకూరివీరభద్రరావుగా రాంధ్రులచరిత్రము రెండవభాగములో గన్నమంత్రి కమ్మసేనాని యని వ్రాసియున్నారు మార్కండేయపురాణములోని కృత్యాది యీయుభయుల నిర్ధారణమునకు వ్యతిరేకముగ నున్నది.
మ. | అమలంబున్ ద్విజరాజవర్ధనము మర్యాదాన్వితంబున్ గుణో | (పీఠిక.ప.29) |
ఆ. | ఆచతుర్థకులసుధాంబుధి నుదయించె, నమితశాంతిచంద్రుఁ డవనిభరణ | (పీఠిక.ప.30) |
పైపద్యములవలనఁ గృతిపతి యగుగన్నయనేనాని శూద్రుఁడనిమాత్రము తేలుచున్నది. కమ్మసేనాని యనియు, నియోగి యనియు వాకొనుట కాధారము లున్నటులఁ దోఁపదు.
మఱియు నీగన్నయసేనానిని, వీరేశలింగము పంతులుగారు, వీరభద్రరావు పంతులుగారు సమముగ గన్నమంత్రి యని వ్యవహరించిరి ఇతనికి మంత్రి యనువిశేషణ మున్నటుల గ్రంథాధారములు లేవు చూడుఁడు
శ్రీగన్నసైన్యాధిపున్ (పీఠిక. ప. 2.)గన్నసైన్యవిభుఁడు (పీఠిక. ప. 39.)
గన్నరథినీపాలున్ (పీఠిక. ప. 3.)గన్నరథినీపతికిన్ (పీఠిక. ప. 46.)
కమ్మదొర యనియు నియోగి యనియుఁ గృతికర్తను వ్యవహరించుట యెట్లు భ్రాంతియో మంత్రి యని పేర్కొనుటయు నటులె భ్రాంతి.
గన్నయసేనానిశాసనములు నిజాముమండలమున మేము శోధించినంతలో నెచ్చటను లభింపలేదు కావున ప్రకృతకథకుఁ జరిత్రాంశములు మార్కండేయపురా