Jump to content

పుట:మార్కండేయపురాణము (మారన).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ప్రళయపవనానలాహతిఁ బడినయట్టి, కులనగములు నిజస్థానములను నిలిపి
యేడుదీవులు వార్ధులు నేర్పరించి, యఖిలజగములు తొల్లిటియట్ల యునిచి.

24

సురనరతిర్యగాదినవవిధసర్గములు

వ.

సృష్టిచింతాపరుం డైనయన్నలువముందట నవిద్య తమంబు మోహంబు మహా
మోహంబు తామిస్రసంబంధంబు ననుసంజ్ఞల నేనుదెఱంగులై తోఁచిన వానిం
బ్రజాపతి బహిరంతఃప్రకాశరహితంబులు ముఖ్యంబులు నగువృక్షంబులుగాఁ
బ్రథమసర్గంబును దిర్యక్స్రోతస్సు తోఁచిన దానం దమోమయంబులు నంతః
ప్రకాశంబులు నగుపశుప్రముఖతిర్యగ్జంతువులుగా ద్వితీయసర్గంబును నూర్ధ్వ
స్రోతస్సు దోఁచిన దాన సాత్వికులు బహిరంతఃప్రకాశులు సుఖులు నగుదేవత
దృతీయసర్గంబును నర్వాక్స్రోతస్సు దోచిన దానం దమోరజస్సముద్రిక్తు
లును బహుదుఃఖపరులును బహిరంతఃప్రకాశులు నగుమనుష్యులుగా జతుర్థ
సర్గంబును గా నిర్మించి యాతరుతిర్యగ్దేవమనుష్యులకు వృత్తులుగా విపర్య
యంబును శక్తియు సిద్ధియుఁ దుష్టియు నను నాలుగు దెఱంగులుగఁ గల్పించి
పంచమం బగుననుగ్రహసర్గంబు నిర్మించె మానససర్వతృప్తు లగుసఫ్తమునుల
నుత్పాదించి కౌమారం బనుషష్ఠసర్గంబు నిర్మించె నిట్లు బ్రహ్మవలన బుద్ధిపూర్వ
కంబు లగువైకృతసర్గంబు లాఱును బ్రహ్మకంటె మున్ను ప్రకృతివలనం బుట్టిన
మహత్సర్గంబును భూతతన్మాత్రసర్గంబును నింద్రియసర్గంబుననం బ్రాకృతసర్గంబులు
మూఁడునుగా నివ్విధంబునం గల్పాదియందు నవవిధసర్గంబులయ్యె ననిన విని
క్రోష్టుకి యి ట్లనియె.

25

బ్రహ్మయవయవములనుండి ప్రజలయుత్పత్తిప్రకారము

.

క.

మునివల్లభ! సంక్షేపం, బునఁ జెప్పితి నీవు సర్గములవిధములు నా
కొనరంగఁ బ్రజలపుట్టువు, వినిపింపుము విస్తరించి విమలచరిత్రా!

26


వ.

అనిన మార్కండేయుం డి ట్లనియె.

27


సీ.

ప్రజల సృజింపఁగ నజుఁడు దామసశరీరముఁ దాల్చుటయు జఘనమున నసుర
లావిర్భవించి రయ్యంగంబు నిశ యయ్యె దీపితసత్వాన్యదేహుఁ డగుడు
నాననంబునఁ బుట్టి రమరు లాగాత్ర మహ స్సయ్యె వెండియు నట్టియెడలఁ
గైకొని పితృభావకలితుఁడై యుండ ను ద్భవమైరి పితరు లాతనువు సంధ్య


తే.

యయ్యె నతులరజోమయం బై నయట్టి, మేను పూనుటయును దాన మానవులు జ
నించిరది జ్యోత్స్న యయ్యె నక్తంచరాదు, లోలి బలవంతు లయ్యయి కాలములను.

28


వ.

మఱియుం బ్రజాపతి రజస్తమోమయం బగురూపంబు గైకొని నిబిడాంధకారం
బగు నిశాసమయంబున క్షుత్పిపాసాపీడితులును విరూపశ్మశ్రుముఖులు నగువా
రలం బుట్టించిన వారిలోనం గొంద ఱాశరీరంబు రక్షించెద మని పలికి రాక్షసు
లైరి కొందఱు భక్షించెద మని పలికి యక్షులై రయ్యిరుదెఱంగులవారిం జూచి