పుట:మత్స్యపురాణము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

81


సీ.

పాశగదాకుంతపాణులై సమవర్తి
       కింకరుల్ చెలరేఁగి పొంక మలరఁ
జండాలకామినీసంగతుం డగుసుభ
       ద్రునిఁ గొనిపోవ నుద్యుక్తు లగుచుఁ
దద్గృహప్రాంగణస్థలమున కరుదెంచి
       తులసీతరుచ్ఛాయ మెలఁగుచున్న
పాపాత్ముఁ డగునట్టిపతితుని వీక్షించి
       యాతనిఁ జేరంగ నలవిగాక
వరుసఁ దప్పక పదుమూఁడువాసరములు
నిలిచి యచ్చోట దోషసంచలితహృదయు
లగుచు నొండొరు లాత్మ నాయమునియాజ్ఞ
కును వణంకుచుఁ దమలోన ననిరి యిట్లు.

90


గీ.

జలజనాభుండు భూరమాసహితుఁ డగుచు
సంతతంబును బృందావనాంతరమునఁ
క్రీడఁ జేయుచునున్నచోఁ గినిసి మనకు
నీతరుచ్ఛాయఁ జేరంగ నీతి యగునె?

91


క.

పాపాభసంయుతుం డగు
నాపతితుని గొనుచుఁ జననియప్పుడె మిగులం
గోపించు నంతకుం డన
నీ పని సమకొల్ప నలవి యెట్లగుఁ దలఁపన్.

92


మ.

అని యీరీతిఁ గృతాంతదూతలు భయాయత్తాత్ములై యాసుభ
దుని జేరంగ నశక్తులైనయెడ నుత్తుంగాకృతుల్ శంఖచ
క్రనవాంభోజగదాసమన్వితకరుల్ రాజద్విభూషాకరుల్
వనజాతాక్షుని కింకరుల్ చనిరి భవ్యంబైన యచ్చోటికిన్.

93


సీ.

ఈచందమున రమాధీశుని కింకరుల్
       బలిమితో నచ్చోట నిలిచినంతఁ
దులసీదళామోదలులితానిలంబుల
       నతిఘనమరణదాహం బణంగఁ