పుట:మత్స్యపురాణము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

మత్స్యపురాణము

ద్వితీయాశ్వాసము


శ్రీరామానుజ మునివచ
నారూఢమతప్రకాశ! యతులితవేదా
చారప్రసిద్ధరక్షా
పారీణకటాక్ష! రంగపట్టణరాజా!

1


వ.

అవధరింపు మిట్లు పుండరీకాక్షుం డానతిచ్చినఁ దదాజ్ఞ యే నంగీకరించి
యప్పుడు తద్వేదపర్వతంబులు చేరం జని నాల్గుహస్తంబుల ముష్టిగ్రాహ్యం
బులగు వేదంబులు గ్రహించిన నవి ఋగ్యజుస్సామాధర్వణంబు లయ్యె
నంత నప్పరమమూర్తి దివ్యశరీరంబువలన లింగశరీరంబులు ధరియించి
న జీవకో ట్లనంతంబులై జనించిన.

2


క.

మునుకొన్న యట్టి జీవులఁ
గనుఁగొని లక్ష్మీశుఁ డంతఁ గౌతుక మొదవన్
ననుఁ జూపి నానితో నీ
ట్లనియెను దరహాసవికసితాననుఁ డగుచున్.

3


గీ.

ఇతఁడు పద్మభవుఁడు చతురాననుం డాత్మ
సముఁడు సర్వలోకశాశ్వతుండు
జీవులార! మీరు చిరకాల మితనిచేఁ
బోష్యు లగుచు మనుఁడు పొలుపుమిగిలి.

4


వ.

అని యి ట్లానతిచ్చి యాపరతత్వరూపంబగు కైటభమర్దనుండును వేద
పర్వతసమేతం బగు వైకుంఠపురంబును నంతర్ధానంబు నొందె నంత నేను
ను దత్ప్రసాదంబున నీబ్రహ్మలోకంబున కరుగుదెంచి రేతోమయం బగు
సృష్టి నిర్మింపం బూని భూబీజమిశ్రణంబున నుద్భిజ్జంబు లై తరుగుల్మాదిరూ