పుట:మత్స్యపురాణము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

పంచమాశ్వాసము


పద్మజాత నీవు పాటించి చెప్పిన
జన్మ మెల్ల నాకు సఫలమయ్యె.

46


వ.

అని యిట్లు నారదుండు చతుర్ముఖునకుఁ బ్రణామం బాచరించి తద్విస్పష్టుం
డై పర్వతునితోడఁ గూడి స్వేచ్ఛావిహారంబున నరిగె. నీక్రమంబున నార
దునకుఁ జతుర్ముఖుండు చెప్పెనని నారాయణమునీంద్రుండు తద్వృత్తాంతం
బు శౌనకునకు నుపన్యసించిన సంతసంబంది గతసంశయుండై పుండరీకా
క్షుండె పరతత్త్వంబని యెఱింగి యమ్మునీంద్రుం డిట్లనియె.

47


క.

నారాయణమునివర! దు
ర్వారాఘసమూహతిమిరవనజప్రియ! నీ
వారూఢిగ వినిపింపుము
నారదుజన్మంబు మాకు నయతత్త్వనిధీ.

48


గీ.

జ్ఞానహేతువైన సత్కర్మమార్గంబు
విడిచి భక్తియోగవిధ మెఱింగి
యతఁడు ముక్తి నందె నని చెప్పితిరి దాని
విధముఁ దెలుపవలయు విశదభంగి.

49


వ.

అని పలికిన శౌనకునకు నారాయణమునీంద్రుం డిట్లనియె.

50


సీ.

పూర్వకాలంబునఁ బుండరీకాక్షుండు
        సంగతి బలి నడంపంగఁ బూని
వామనుఁడై చిన్నివడువురూపముఁ దాల్చి
        యతఁడు యజ్ఞము సేయునపుడు వోయి
యెడపక వసుధ మూఁడడుగులమాత్ర మ
        య్యవనితలేశ్వరు నడిగికొనియు
భూతలం బెల్ల సంపూర్ణంబుగా నొక్క
        పాదాంబుజాతంబుఁ బాదుకొల్పి
మఱియునొక్కటి సకలదిఙ్మండలమున
సందులేకుండ మింటిపైఁ జాఁచియుండ
భాసిలుచునుండు తద్విష్ణుపాదజలజ
ముద్ధృతము చూచి తద్భక్తియుక్తుఁ డగుచు.

51