పుట:భాస్కరరామాయణము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శునశ్శేఫునికథ

క.

అంత నయోధ్యాధిపుఁ డ, త్యంతఘనుం డంబరీషుఁ డధ్వర మధిక
స్వాంతమునఁ జేయఁ దొడర బ, లాంతకుఁ డెత్తుకొనిపోయె నామఖపశువుల్.

616


వ.

అప్పు డాయాజకుం డారాజు నవలోకించి.

617


క.

నీవు మదంబునఁ బశువుం, గావక యేమఱితి పశువు గలుగక యున్నన్
వేవే ప్రాయశ్చిత్తము, గావింపఁగవలయు నెట్టిక్రతువున కైనన్.

618


వ.

నరు నైనఁ బశువుఁ గాఁ జేసి యాగంబు సేయవలయు నని పలికి.

619


క.

క్రతు వంతరాయ మైనను, గ్రతుకర్త వినాశ మొందు ఘనపాపముచేఁ
గ్రతు వెడపకుండఁ జయ్యనఁ, గ్రతుపశువుం దేరవలయుఁ గ్రతుపుణ్యనిధీ.

620


వ.

అనిన రాజు కళత్రపుత్రాదులతోడ.

621


చ.

వనములఁ గొండలన్ గుహల వాఁగుల బావులఁ బల్వలంబులన్
ఘనతృణసీమలం బశునికాయములోపల గోష్ఠభూములం
దనరెడునట్టికందువలఁ దక్కినదేశములం బురంబులం
గనుకనిఁ జూచుచున్ వెదకి కానక చెచ్చెర వచ్చి యొక్కెడన్.

622


క.

అనఘాత్ముం డగురుచికుం, గనుఁగొని మఖపశువు వెదకి కానము నీనం
దను నొకని లక్షగోవులఁ, గొని పశువుం గాఁగ నిమ్ము కోరిక ననినన్.

623


తే.

పెద్దవాఁడు నా కెంతయుఁ బ్రియతినూజుఁ డతని నే నీకు నీఁజాల ననియెఁ దండ్రి
పిన్నవాఁడు నా కెంతయుఁ బ్రియుఁడు గాన, యాకుమారుని నీఁజాల ననియెఁ దల్లి.

624


వ.

అట్లయ్యిరువుకుం దగ నాడువాక్యంబులు విని శునశ్శేఫుం డి ట్లనియె.

625


తే.

పెద్దవాఁడు తండ్రికిఁ జాలఁబ్రియసుతుండు, పిన్నవాఁడు తల్లికి ముద్దుప్రియసుతుండు
వారలిరువురు నొల్లనివాఁడ నయిన, మధ్యముఁడ నేను వచ్చెద మానవేంద్ర.

626


వ.

నీ విచ్చెడు ననినగోవుల వీరి కిమ్ము నీవెనుక నే వచ్చెద ననిన నతం డాలక్షగోవుల
వారి కిచ్చి శునశ్శేఫుని రథంబున నిడికొని సంతోషంబున నేతెంచి పుష్కరక్షేత్రం
బున విడిసి యుండ.

627


సీ.

అచట విశ్వామిత్రుఁ డత్యుగ్రతపము సే, యంగ శునశ్సేఫుఁ డచటి కరిగి
భక్తి నామామకుఁ బ్రణమిల్లి కృతపుణ్య, తమ కతిప్రేమపాత్రంబు లనుచుఁ
గన పెద్దకొడుకు నాతండ్రియు మఱి పిన్న, కొడుకు నాతల్లియుఁ గూర్మి
పాపాత్ము లై యజ్ఞగపశువుగాఁ గృపమాలి, యంబరీషునకు న న్నమ్మికొనిరి
తనకు వార లెక్కడితల్లిదండ్రు లనఘ, నీవ తల్లివి దండ్రివి నీవ గురువు
క్షితిపుయజ్ఞంబు వెలయంగఁ జేసి నన్నుఁ, గావు ప్రాణదానం బిడి కరుణతోడ.

628


వ.

అనుచు దీనుండై యభయంబు వేఁడునల్లుని నాదరించి కౌశికుండు దనతనయుల
నవలోకించి.

629


క.

సుతులార నాకు నల్లుం, డితఁ డారయ మునిసుతుండు హితమతి మీలోఁ