పుట:భాస్కరరామాయణము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్జరపురి కేఁగె నంత సువిచారి దిలీపనృపాలుఁ డాత్మలోన్.

437


మ.

నమితారాతి దిలీపభూవిభుఁడు నానాయజ్ఞముల్ సేసి యిం
పమరన్ ముప్పదివేలవర్షములు రాజ్యప్రాప్తుఁ డై తద్దయుం
బ్రమదం బార సుతున్ భగీరథవిభుం బట్టంబు వే కట్టి రో
గముచేతం దుదిఁ బొంది పుణ్యవశతం గాంచెన్ మరుల్లోకమున్.

438

భగీరథుండు గంగను భూమికిం దెచ్చుట

క.

ప్రథితమతి భగీరథుఁ డతి, రథుఁడు సుతుల్ దనకు లేమి రాజ్యంబు మనో
రథ మారఁ జేయుఁ డనుచుం, బృథుమతు లగుసచివులందుఁ బెట్టె సుబుద్ధిన్.

439


వ.

ఇవ్విధంబునం బ్రధానులందు రాజ్యంబు చేర్చి భగీరథుండు గోకర్ణంబునకుం
జని యందు.

440


శా.

బాహుద్వంద్వము మీఁది కెత్తి కడఁకం బంచాగ్నితప్తుండు మా
సాహారుండు జితేంద్రియుండు నతినిష్ఠాయచిత్తుండు న
వ్యాహారప్రవణుండు నై బహుసహస్రాబ్దంబు లేకచ్ఛల
గ్రాహిత్వం బమరన్ మహాతపము గోకర్ణంబునం జేయఁగన్.

441


క.

జలజాసనుఁ డాతపమున, కలఘుప్రీతాత్ముఁ డగుచు ననిమిషగణముల్
గొలువ భగీరథుపాలికి, నెలమిం జనుదెంచి యతని కి ట్లని పలికెన్.

442


క.

నీతపమున కెంతయు నేఁ, బ్రీతుఁడ నైతి వర మడుగు ప్రియమున నన నా
ధాతకు మ్రొక్కి భగీరథుఁ, డాతతసంతుష్టహృదయుఁ డై యి ట్లనియెన్.

443


క.

అస్మత్ప్రపితామహబహు, భస్మంబులమీఁద గంగఁ బఱపుము నాచి
త్తస్మృతి సఫలతఁ బొందఁగ, నస్మద్వంశజులు నాక మరిగింపు తగన్.

444


క.

లోకైకనాథ విను మి, క్ష్వాకుకులం బంతరించి కడచనకుండన్
నా కీ సంతతి యనవుడు, నాకమలజుఁ డతనితోడ నయ్యెడు మనుచున్.

445


క.

దివిషద్గంగాపాతం, బవని వహింపంగఁ జాల దానదిఁ దాల్పన్
శివు వేఁడు శివుఁడు దక్కఁగ, నవలీలను గంగఁ దాల్ప నన్యులవశమే.

446


వ.

అని పలికి బ్రహ్మ తనలోకంబున కేఁగ భగీరథుం డచ్చట.

447


శా.

అంగుష్ఠాగ్రము నేల మోపి తప మేకాబ్దంబు నిండంగఁ జే
యంగన్ దర్పకవైరి వచ్చి పరితుష్టాత్ముండ నైతిన్ వియ
ద్గంగం దాల్చెద మౌళి నా నపుడు రంగత్తుంగభంగత్వరన్
గంగాసింధువు నింగినుండి పడియెన్ గౌరీశుజూటంబునన్.

448


వ.

అట్లు హరుజూటంబుఁ బ్రవేశించి యంతర్గతంబున.

449


చ.

హరుని నతిక్రమించి గగనాపగ పన్నగలోక మేఁగ వే
గిరపడఁ జూచి శంకరుఁడు గిన్క విరోధము సేసి యాఁప నా
హరునికపర్దకందరమునందు భ్రమించుచు నుండె నెందుఁ దా