Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జ్జనకుల్ వచ్చిరి వారిఁ గానవె మఖాశ్వంబులున్ నిరీక్షింపవే.

428


చ.

అనవుడు దైత్యదానవవిహంగభుజంగపిశాచదేవపూ
జనముల నొందునాగజము సమ్మద మారఁగ నంశుమంతుతో
నను [1]జననాథనందన కృతార్థుఁడ వై తురగంబుఁ గొంచుఁ జ
య్యనఁ జనుదెంచె దన్న ముద మందుచు నేఁగి క్రమక్రమంబుగన్.

429


వ.

సకలదిగ్గజంబులకుఁ బ్రదక్షిణపూర్వకంబుగా నమస్కరించుచు నాదిగ్గజంబులఁ
బితృమఖాశ్వంబులసుద్దు లడిగిన నక్కుంజరములు గృతార్థుండవై వచ్చెద వన్న
నట్ల కాక యనుచు నరిగి యమ్ముందటఁ బితృభస్మరాసులు పొడగని యత్యంత
దుఃఖంబున శోకించుచు నచ్చేరువం దిరుగుచున్న మఖాశ్వంబుఁ బొడగని వగలం
బొగిలి కొంతదడవునకుఁ బితృవర్గంబున కుదకక్రియ లొనరింపవలయు నని యొ
క్కజలాశయం బరయుచుఁ దనపితృమాతులుం డగుగరుత్మంతుఁ బొడగ
నియె నాసమయంబున.

430


మ.

గరుడుం డాదట నంశుమంతు నతిదుఃఖశ్రాంతు నీక్షించి స
త్కరుణన్ శోకము మాను పుత్ర సకలక్ష్మాభేరులై నీపితల్
పరుషోద్యత్కపిలోగ్రకోపశిఖలన్ భస్మంబు లై ర త్తెఱఁ
గరయన్ దైవికమున్ జగత్ప్రియము ధైర్యం బొందు మింకం దగన్.

431


మ.

సురలోకాపగఁ దెచ్చి యాభసితరాసుల్ ముంచి యీగంగలోఁ
బరఁగం బైతృకకృత్యముం జలుపు నీపైతృవ్యులన్ నాకమం
దిరసంప్రాప్తులు గాఁగఁ జేయు తురగాన్వీతుండ వై నీవు నీ
పురికిన్ వేచను నీపితామహుని సంపూర్ణక్రతుం జేయఁగన్.

432


క.

ఇతరజలక్రియలు సమం, చితగతి నీపితల కెట్లు చేసిన దివి స
ద్గతి లేదు గాన యిప్పుడు, పితరుల కుదక మిడవలదు పితృహితవర్తీ.

433


వ.

అని యిట్లు వైనతేయుండు పలుక శీఘ్రంబ యామఖాశ్వంబుం గొని నగరపా
లి కేతెంచి యంతవృత్తాంతంబు నెఱింగింప నాభూపతి విధ్యుక్తక్రమంబున న
య్యజ్ఞంబు సంపూర్ణంబు సేసి తనపురంబున కేఁగి సతులుం దాను ననురాగంబున.

434


క.

సురుచిరభోగము లందుచుఁ, బొరిఁబొరి జనులెల్లఁ దన్నుఁ బొగడఁగఁ గీర్తుల్
పరఁగఁగ ముప్పదివేల్వ, త్సరములు రాజ్యంబు సేసి చనియెన్ దివికిన్.

435


క.

జను లనుమతింప సగరుని, మనుమఁడు ధీమంతుఁ డంశుమంతుండు మహీ
జనులకు రా జై వెలయుచు, ఘనుఁ డైనదిలీపనృపతిఁ గనియెం బరఁగన్.

436


చ.

స్థిరమతితో దిలీపు విభుఁ జేసి హిమాచలపార్శ్వకాననాం
తరమున నంశుమంతుఁ డతిదక్షత ముప్పదిరెండువేలువ
త్సరములు నిష్ఠతో నధికదారుణ మైనతపంబు సేసి ని

  1. నృపవర్యనందన