Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గొలఁది కెక్కిన సౌధముల్ గోపురములు, ధరణిపైఁ బడ వేడుకఁ దాఁచువారు.

1837


ఉ.

రావణుఁ బట్టి తెం డనుచు రాక్షసులన్ వడి మోఁదువారు దు
ర్భావుఁడు వానిఁ జూపుఁ డని బాధలఁ బెట్టెడువారు వాఁడు నే
ఠావున నున్నవాఁడొ ప్రకుటంబుగ మా కెఱిఁగింపుఁ డంచు బా
హావరశక్తియుక్తులు వనాటులు విక్రమలీల సల్పఁగన్.

1838


చ.

తలకుచు నాండ్రు బిడ్డలును దద్దయు నేడ్వఁగ నిండ్లు చొచ్చి యి
ట్టలముగ దైత్యవీరులఁ గడంగి వడిన్ వెడలంగ నీడ్చి త
ల్లులు వగ నొంది కుందఁ దలలుం జరణంబులుఁ గూడఁబట్టి భూ
తలమున వేసి చంపి రతిదారుణచేష్టితు లైనవానరుల్.

1839


లయవిభాతి.

కడలుకొనురౌద్రమునఁ గడఁగి సమరోత్సవము లెడపడక యుండ నొగి నడుముకొని శక్తిం
దడఁబడక పేర్చి వడి నడుగు లిడువేగమునఁ బుడమి పెనువ్రయ్య లయి బడలువడి క్రుంగన్
జడిసి చనురక్కసుల నొడిసి వెసఁ బట్టుకొని నడుము లగలం జఱిచి తొడరి తల లూడం
బొడిచి పెనునెత్తురులు మడువులుగఁ బాఱఁగను బెడిదముగ వానరులు సుడివడక పోరన్.

1840


ఉ.

భీతకరీంద్రదీనతరబృంహితనాదములం దురంగమ
వ్రాతవికీర్ణహేషితవిరావములన్ శిశువృద్ధకామినీ
జాతనితాంతరోదనవిసర్పిరవంబుల దుఃఖవిక్రియో
పేతము గాఁగ లంక వడి నేడ్చుచు నున్నదివోలె నుండఁగన్.

1841


తే.

సురిఁగి భయమున గొందులు సొచ్చువారు, నెగిచి పఱతేర సందుల కేఁగువారు
నరుగ వానరు లెదురైనఁ దెరలువారు, నైరి దితిజులు మద మఱి యంతనంత.

1842


చ.

పతిహిత మాచరింప నతిభవ్య విభీషణుభార్య సాధుస
మ్మతసుచరిత్ర యాసరము మానుగ వే చనుదెంచి యెంతయుం
జతురత వాలిసూనునకు సమ్మతిగాఁ గరసంజ్ఞఁ జూపె న
ద్దితిజుఁడు వేల్చుగహ్వరము ధీరులు వానరు లుత్సహింపఁగన్.

1843

అంగదాదివానరులు రావణుహోమము చెఱుచుట

వ.

అంగదుండును సమ్మదసంరంభరోషంబులు ముప్పిరిగొన రావణుం డున్నగుహా
ద్వారంబు నేర వచ్చి.

1844


క.

ఆవాకిట నున్నఘన, గ్రావం బవలీల నుగ్గు గాఁ దన్ని మహా
రావంబు సెలఁగ లోపలి, కావాలితనూజుఁ డేఁగి యంతటిమీఁదన్.

1845


ఉ.

రావణుఁ గాంచె నం దురుతరస్ఫుటసాయకజాలవిద్రుతై