Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్రాతాసూనము లై యుగాంతజలదారంభంబు లై విస్ఫుర
ద్వాతోద్ధూతము లై నభంబు గలయన్ వ్యాపించె భీమంబుగన్.

1830


ఉ.

ఓలిన ధూమమండలము లుగ్రతఁ బేర్చి నభంబుఁ గప్పెఁ బా
తాళములోననుండి సముదగ్రత వచ్చి రవిం దమోఘ్ను నా
భీలత నొక్కమైఁ బొదువుభీకరసంతమసంబులో యనం
గాలకరాళగాత్రలయకాళిశిరోరుహసోదరంబు లై.

1831


చ.

అలఁగిరి సేంద్రదిక్పతు లృహంకృతి దప్పిరి సిద్ధచారణుల్
గలఁగిరి యక్షకిన్నరులు గంపము నొందిరి నందనౌకసుల్
నలఁగిరి దివ్యకామినులు నాశముఁ బొందిరి ఖేచరేంద్రులుం
దలఁగిరి సన్మునీశ్వరులు దల్లడ మందిరి వానరేశులున్.

1832


క.

ఆసమయంబునఁ గడుసం, త్రాసమున విభీషణుండు దశముఖుహోమో
ల్లాసితధూమంబులు గని, కౌసల్యాతనయుఁ బల్కెఁ గడురభసమునన్.

1833


సీ.

నినుఁ బోరిలోపల నిర్వహింపఁగ లేక, తద్దయు విముఖుఁ డై దశముఖుండు
తివిరి యాశుక్రోపకదిష్టమార్గంబున, విజయార్థి యై యదె వేల్చుచున్న
వాఁడు చూచితె నభోవలయంబు పటుధూమ, బహుళకదంబకపిహిత మగుచు
నున్న దిప్పుడు మహాహోమంబు నిర్విఘ్న, మై యథావిధిఁ బూర్ణ మయ్యెనేని
కులిశచక్రపినాకహస్తులకు నైన, దుర్జయుం డగుఁ గావునఁ దొడరి వేగ
మతనితద్విధి కంతరాయంబు సేయఁ, బనుపు వానరవీరుల బరవసమున.

1834


వ.

అనిన మనుకులకేతనుండు పవనసుతగంధమాదనాంగదమైందద్వివిదపనసశంభ
తారగజగవాక్షగవయవినతధూమ్రజ్యోతిర్ముఖనలనీలశతవలిక్రోధనకుముదవేగ
దర్శిగోముఖప్రముఖు లయిన మహాబలీముఖవీరులఁ బదికోట్ల నియోగించిన వా
రు పాదపపాషాణపర్వతపాణులై వియన్మార్గంబున నరిగి లంక సొచ్చి ఘూర్ణమా
నార్ణవోదీర్ణు లయి గర్జత్పర్జన్యసమూర్జితులై సింహనాదంబుల దిక్కులు పిక్క
టిల్లం జద లద్రువం బుడమి బడలువడం దఱిమి.

1835


మ.

నగసంకాశమహాశరీరులు మరున్నాగోపముల్ వానరుల్
నగరోపాంతము సేరి రక్షకుల నున్మార్గంబునం గూల్చి బి
ట్టుగ దౌవారికుల వధించి సమరాటోపంబునన్ బాహుగ
ర్వగరిష్ఠాసురభంజనోత్సవకృతవ్యాపారపారీణు లై.

1836


సీ.

పృథుశాలలం దున్నరథముల నేలతో, విఱుగంగ నురవడి వ్రేయువారు
విపులగేహస్థితద్విపరాజకుంభముల్, పొరిఁబొరిఁ బగులంగఁ బొడుచువారు
మందురావలి సొచ్చి మహితాశ్వములఁ బట్టి, చదియంగ నేలతోఁ జఱచువారు
నాయుధాలయముల కతిరయంబున నేఁగి, వివిధాస్త్రవితతులు విఱుచువారు
భాండగృహములలో నున్నబహుధనములు, సరకు సేయక మొగిఁ బాఱఁజల్లువారు