Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోల్లాసంబున నవ్విభీషణునకై యూహింప కేతెంచుచోఁ
జెల్లింపం దగు నీకు నీప్రతిన నాచేఁ జావు సిద్ధంబు నీ
పెల్లెల్లం బొలియించుశక్తి యని సుస్ఫీతంబుగాఁ బల్కుచున్.

1546

రావణునిశక్తిచేత లక్ష్మణుండు మూర్ఛఁ బొందుట

సీ.

ప్రళయోగ్రమార్తాండపరివేషమండల, దీప్తులు సుడివడఁ [1]ద్రిప్పి వైవ
నష్టఘంటానాద మవనిభూధరగుహా, గర్భగేహంబులఁ గలయఁ బర్వఁ
గల్పాంతపావకకల్పమహాజ్వాల, లంబరంబుననుండి యవులఁ జనఁగ
శేషభోగీశ్వరజిహ్వాకరాళ మై, చనుదేరఁగా రామచంద్రుఁ డప్పు
డడరి సౌమిత్రి చావకుండెడు మనంగఁ, గపులహాహారవంబులు గలసి బెరయ
శరములన్నియుఁ జదువుచు శక్తి వచ్చి, యురము గాఁడిన లక్ష్మణుం డుర్విఁ గూలె.

1547


చ.

బలపరిణాహసంపదయు బంధురబాహుసమగ్రశక్తియుం
బొలిసిన నిర్విచేష్టుఁ డయి భూస్థలిపైఁ బడె సంక్షయంబునన్
నిలువక కూలుమేరుధరణీధరమో యనఁ గూర్మితమ్మునిం
దరలక చూచి నెమ్మనము తాలిమి దూలఁగ రామభద్రుఁడున్.

1548


చ.

వనజదశాగ్రభాగముల వావిరిఁ గ్రమ్ముహిమంబుచాడ్పునం
గనుఁగవ లశ్రుబిందువులు గాఱఁగ డెందము తల్లడిల్లఁగా
బెనుపగ చిమ్మచీఁకటులపెల్లు వివేకదినేశమండలం
బునఁ దొలఁగంగఁ ద్రోచి గుణభూషితధైర్యసఖావలంబుఁ డై.

1549


చ.

వనరుహమిత్రసన్నిభునికవక్షము పెల్చన దూఱి భూమి గాఁ
డినఘనశక్తియుం బెఱుక డెప్పర మైనఁ గపీంద్రు లూరకుం
డినఁ జనుదెంచి రోషము నటింపగ వే పెకలించి త్రుంచె నే
పున వినతాసుతుండు ఫణిపుంగవముం దునుమాడుకైవడిన్.

1550


శా.

ఆలోనన్ రజనీచరేశ్వరుఁడు కర్ణాంతోపసర్పద్గుణా
భీలుం డై ఫణిరాజసన్నిభధనుర్భీమత్వసంపాది యై
కీలాలంబులు మేనఁ గ్రమ్మి తొరఁగం గీలించె నారాచము
ల్భూలో కాధిపుమీఁద మత్సరకరాళుం డై రణవ్యగ్రతన్.

1551


మ.

కరకావర్షము లద్రి యోర్చుకరణిన్ గర్వాంధనక్తంచర
స్ఫురదస్త్రంబులు లెక్క సేయక జగత్పూర్ణానుభావుండు భూ
నరుఁ డామారుతుకూర్మినందనుని భాస్వత్సూనునిం గాంచి సం
గరసంరంభరసంబు వెల్లివిరియం గా వారితో ని ట్లనున్.

1552


చ.

గొనకొని శోకవేగమునకున్ సమయం బిది గాదు విక్రమం
బున కగువేళ గావునఁ బ్రభూతభుజాయతశక్తి చూపెదన్

  1. దీర్చి త్రిప్పి