Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యును బదు నెనిమిది శరాసనంబులుఁ బిడిపట్టుహస్తచతుష్టయంబు నిడుపుపది
చేతులుం గరకరాళకరవాలంబులు రెండు నభేద్యకవచంబును బడసినాఁడు వీఁడు
తురగకరిరథారూఢుం డైనప్పుడు ఖడ్గకంపణకార్ముకసమరంబులం బ్రవీణుం డిమ్మ
హాబాహుం డస్త్రధరశ్రేష్ఠుండు నార్యసేవానురక్తుండును బహుశ్రుతుండును నీతి
శాస్త్రకోవిదుండు ననం బ్రసిద్ధుం డితనిభుజబలంబున లంక నిరాతంకం బై యుండు
వీనిబాణంబుల వజ్రప్రముఖదివ్యాయుధంబులు నిష్ప్రభంబు లైనవి కావున దేవ
మీ రివ్వీరునం దధికయత్నంబు సేయునది కార్యం బని చెప్పె నాసమయంబున.

1020


క.

మిడుతగమి వాఱుతఱుచున, నుడుమార్గము నిండి పాఱునుగ్రాస్త్రములన్
మిడుఁగుఱులు రాలఁ గపులను, సుడిపడి వడిఁ బాఱ నేయుచుం గట్టల్కన్.

1021


క.

ఘననేమిఘట్టనధ్వని, వనధిధ్వానంబు నడఁప వడిఁ జూపజ్యా
నినదంబు దాని లోఁగొన, వనచరబల మతఁడు సొచ్చి వ్రచ్చెం గడిమిన్.

1022


అ.

అప్పు డార్పు లెసఁగ నందఱు నతనిపై, నుక్కు మెఱసి వచ్చి యూథపతులు
మార్కొనంగ నందు మైందద్వివిదనీల, శరభకుముదు లద్రిచరులు గడఁగి.

1023


క.

తరులును గిరిశృంగంబులు, నురవడిఁ గొని మీఁద వైవ నురుభల్లములన్
మురియలు సేయుచు [1]నయ్య, చ్చరకొడుకు ధనుఃకలావిశారదుఁ డగుచున్.

1024


క.

ఒక్కొకనెఱనారసమున, నెక్కుడువడి వారియురము లేసి నిలుపుచున్
స్రుక్కించెం గరలాఘవ, మక్కజముగఁ గోలఁ గోల నందఱు కపులన్.

1025


వ.

అట్లు విక్రమించి గర్జించినం బ్లవంగపుంగవులు చేయునది లేక కంఠీరవభైరవా
రావంబు విన్నకురంగంబులతెఱంగు నొంది రప్పౌలస్త్యుండును జేర నేతెంచి
రఘువరుం గనుంగొని.

1026


మ.

శరచాపంబులు గేలఁ బూని రథి నై సంగ్రామ మర్థించి భూ
వర నీపై నిదె వచ్చినాఁడ మొదలన్ వారాశిపై వాలిపై
ఖరుపై నేసినకోల లేయు మిటఁ జక్కం గమ్ము నాయమ్ము లిం
కొరుపైఁ బాఱవు దేవదానవజయోద్యోగాభిమానంబునన్.

1027

లక్ష్మణుం డతికాయునిఁ జంపుట

ఉ.

నా విని లక్ష్మణుండు నరనాథున కడ్డము చొచ్చి నిల్చె రో
షావిలమానసుం డయి కులాచలగహ్వరదిగ్దిగంతదం
తావళకర్ణకోటరవితానవియద్భరితంబుగా గుణా
రావము సేయుచుం బటుశరంబు గరంబున నల్లఁ ద్రిప్పుచున్.

1028


తే.

అప్పు డవ్వింటిమ్రోఁతకు నఖిలరజని, చరులు భీతచేతస్కు లై సంభ్రమింప
నద్దశాననతనయుఁడు నరుదుతోడి, మెచ్చు మనమునఁ బొడమ సౌమిత్రిఁ జూచి.

1029


ఉ.

పిన్నవు మున్ను గయ్యములు పెక్కు లెఱుంగవు దివ్యబాణసం

  1. నారాత్రించరుకొడుకు