Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారిపై నెత్తిపోనున్నవార్త కేను, వెఱచి వచ్చితి మఱియుండుతెఱఁగు గాదు.

765


శా.

రాముం బుణ్యగుణాభిరాముఁ ద్రిజగద్రక్షైకదీక్షాగురున్
సామాన్యక్షితినాథుఁ గాఁ దలఁచి తత్సామర్థ్య మూహింప కా
భూమీశాగ్రణిదేవి నుత్తమసతిం బూతవ్రతన్ నీకుల
క్షేమం బొల్లనిభంగిఁ దెచ్చితి [1]ప్రభుశ్రీ నింత గర్హింతురే.

766


చ.

ఇనకులనాథు మున్ను వినమే మన మట్టిఖరాదులన్ రణం
బునఁ దునుమాడఁడే యొకఁడ పూని విరాధుఁ గబంధుఁ దాటకా
తనయు వధింపఁడే వినుము తక్కినవేయును నేల యమ్మహా
వనచరు నొక్కతూపునన వాలిఁ బరాక్రమశాలిఁ గూల్పఁడే.

767


ఉ.

ఆరసి చూడ లక్ష్మణుఁడు నమ్మహితాత్మునియట్టివాఁడ దు
ర్వారబలాఢ్యు లాకపులు వారలలావులు మున్ను మీరు గ
న్నారును వేయునేల నరనాయకుఁ డల్పుఁడు గాఁడు భూతసం
హార మొనర్ప నైనఁ గలఁ డల్గిన [2]వాలియ సాక్షి దానికిన్.

768


క.

సౌమిత్రి గొల్చిరా వన, భూమికిఁ దనతండ్రియాజ్ఞ భూసుతతోడన్
రాముఁడు సనుదెంచినవాఁ, డీమిషమున సురల మునుల నెల్లను బ్రోవన్.

769


ఆ.

కాన విగ్రహంబు కార్యంబు గాదు నీ, తిజ్ఞు లయినవారితెరువు దలఁచి
వలయువారిఁ బుచ్చ వలయు సామమునకు, రాముకడకు మనకు రాక్షసేంద్ర.

770


చ.

ఇదియ మతంబు మంత్రులకు హేమమహామణిముఖ్యవస్తువు
ల్మొనలుగ సీత నాసకలలోకశరణ్యున కిచ్చి పుచ్చి నె
మ్మది మముఁ బ్రోవు [3]మీవనితమాటలు ద్రోచితి గాక నీతికో
విదుఁడు విభీషణుండు మును వేయివిధంబులఁ జాటి చెప్పఁడే.

771


మ.

అతికాయుండును మాల్యవంతుఁడును యూపాక్షుండు నీమువ్వురున్
మతిమంతుల్ మన కెంతయున్ హితులు సామం బెట్లుఁ గావింప నే
రుతు రచ్చోన విభీషణుండు నయధుర్యుం డున్నవాఁ డాతఁ డే
గతి నైనన్ సమకొల్పఁ జాలుఁ దను నైక్ష్వాకుండు మన్నించుటన్.

772


చ.

సమరమునందు శాత్రవులె చత్తు రనం జన దాత్మహానియున్
సమకొను గెల్పు సందియము సన్నుతి కెక్కినసామభేదదా
నము లవి యుండఁగా మొదలు నాలవవెంట సమస్తబంధునా
శమునకు నోర్చి రాజు లిటు సాహసవృత్తిఁ దొడంగు టొప్పునే.

773


క.

మనవారలు ధూమ్రాక్షుం, డు నకంపనుఁడుం బ్రహస్తుఁడు మహాకాయుం
డును లోను గాఁగ సమరా, వనిఁ జచ్చిరి దీన నేమి వచ్చెం జెపుమా.

774


ఉ.

ఒక్కఁ డొకండ దిక్పతుల నోర్చినవారు ప్రహస్తముఖ్యు ల

  1. ప్రభుస్త్రీ
  2. వార్ధియ
  3. నీ వతనిమాటలు