పుట:భాస్కరరామాయణము.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

వరుణలోకంబునకుం జని సముచితప్రకారంబున నాప్రచేతనుచేతం బూజితు
లగుచు మగిడి యేతెంచి రంత నక్కడ దశకంధరుండు.

289

రాముఁడు సేతువు దాఁటి వచ్చుట విని రావణుఁడు మంత్రులతో నాలోచించుట

క.

అర్ణవము గట్టి దిక్కులు, ఘూర్ణిల్లఁగ రిపులు లెక్కగొనక సువేలా
భ్యర్ణమున వచ్చి విడియుట, కర్ణాకర్ణిగ నెఱింగి కలఁగినమదితోన్.

290


సీ.

కొలువున కేతెంచి కలయ మంత్రులఁ జూచి, వారితో నిట్లను మీరు నాకుఁ
బనులకుఁ గలవార లని చూతుఁ బ్రెగ్గడ, లగుచున్నమీనేర్పుఁ దగవు లెస్స
జడనిధి బంధించి కడచి వచ్చిరి మార్తు, రీవార్త లరయంగ వేవు లేద
రాజు లేమఱియున్న రాజనీతిస్థితి, సచివు లేమఱి యుండు టుచిత మగునె
నేర కున్నారె కొంద ఱెవ్వారొ మమ్ము, నొల్లకున్నారు గాక నాఁ దల్లడిల్లి
[1]వారలందఱుఁ దల లటు వ్రాల వైవ, నింద్రజితుఁ డంతఁ దండ్రితో నిట్టు లనియె.

291


ఉ.

రాచగుణంబు పోవిడిచి రాజ్యము గోల్పడి వీడు వెల్వడం
ద్రోచినఁ జక్క వచ్చిన నరుండును గ్రోఁతులు నాఁగ నెంత దో
షాచరనాథ దీనికి విచారము మేలె యి టైన నట్లు భ
ర్గాచలపాటనక్షమము లైనభుజంబులపెంపు దూలదే.

292


సీ.

దిగ్విజయార్థి నై దివిజసేనల గిట్టి, జంభారి నాగపాశములఁ గట్టి
తెచ్చితి జముక్రొవ్వు దీర్చితి వరుణు నో, డించితి ధనదు నొడిచితిఁ గాల
కేయాదిదనుజుల గెలిచితిఁ గాద్రవే,యుల నదల్చితి సోము నుష్ణధాముఁ
బఱపితి వసువులఁ బరిభవించితి మరు, ద్గణములఁ దోలితిఁ గడఁక మఱియు
నవనిపైఁ గలనాజుల నాజులందుఁ, గాందిశీకులఁ జేసితిఁ గడిమి నన్నుఁ
జెనయ నెవ్వఁడు గలఁ డేల చింత నీకు, నాశరార్చుల కెదురె వానరులు నరులు.

293


చ.

గజుఁడును జాంబవంతుఁడును గాలితనూజుఁడు నంగదుఁడు న
ర్కజుఁడు సుషేణుఁడున్ మొదలు గాఁ గపికోటులు రామలక్ష్మణుల్
రజనిచరాధినాథ సమరంబున నీసుతుఁ డింద్రజిత్తుపె
న్భుజముల నుగ్గునూచ మయి పోయినవారలు గాఁ దలంపుమీ.

294


వ.

అనినం బ్రహస్తుండు హస్తం బెత్తి వియత్తలంబున నదరులు సెదర ముసలంబుఁ
ద్రిప్పుచు ని ట్లనియె.

295


చ.

అనిమొన మేఘనాథుఁ జెనయం గలవీరుల మున్ను గంటిమే
యనిమిషదానవోరగభటాదులయందును నిమ్మహాశరా
సనుకథ లెల్ల నేల పెలుచన్ విలసన్ముసలంబు గ్రాలఁ బే
ర్చినననుఁ దేఱిచూడఁ గలరే కపులుం గడుఁబేదమర్త్యులున్.

296


వ.

అనిన ధూమ్రాక్షుం డి ట్లనియె.

297
  1. వారు దలలను వ్రాలవై చూరకున్న నింద్ర