పుట:భాస్కరరామాయణము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాముఁడు శబరిం గరుణించుట

చ.

ఉరుతరవిఘ్నముల్ దొడర కున్నతి నొందఁ దపంబు సేయుదే
గురువుల భక్తితోఁ గొలుతె కోపము మోహము లేక యుండుదే
యిరవుగ సంయమంబు విజితేంద్రియవృత్తియుఁ గల్గి సౌఖ్యముం
బొరయుదె పుణ్యసంయములు పోఁడిగ నీకడ కేఁగుదెంతురే.

411


క.

అనవుడు సర్వము భద్రం, బని యాసతి నృపతితోడ ననియెన్ రఘునం
దన నీశుభదర్శనమునఁ, దనరఁ దపస్సిద్ధిఁ గంటి ధన్యత నుంటిన్.

412


చ.

జనవర చిత్రకూటమున సమ్మతి మీరు వసించియుండఁగా
దినపసదృగ్విమానములఁ దేజము లార మహాత్ము లైనస
న్మును లిట కిచ్చ వచ్చినఁ బ్రమోదము లారఁగ నర్చ లిచ్చినన్
మనముల సంతసించి మఱి మచ్చిక ని ట్లని రాతపోధనుల్.

413


చ.

ఘను లగురామలక్ష్మణులు గార్యముమై యిట కేఁగుదెంతు రే
పునఁ జన నానృపాలురకుఁ బూజ లొనర్చి సమగ్రపుణ్య వై
యనిమిషలోక మేఁగె దని యాదర మారఁగ నాకుఁ జెప్పి యిం
పెనయఁగ వారు నాకమున కేఁగిరి రామనృపాలశేఖరా.

414


చ.

వివిధము లైనవన్యములు వేడుక నే నొనఁగూర్చి మిమ్ముఁ బ్రా
భవమునఁ బూజసేయఁగను బ్రార్థన సేసెద మీకు దీని గా
రవమున స్వీకరింపుఁ డన రాఘవుఁ డారమణీయవన్యముల్
ప్రవిమలబుద్ధిఁ జేకొని తపస్విని కారఘురాముఁ డి ట్లనున్.

415


క.

దనుసుతుఁడు నీప్రభావము, మును నాకుం జెప్పె నిపుడు మోదముతోడం
గనుఁగొంటి ననుడు నాసతి, మన మలరఁగ విభునితోడ మఱి యి ట్లనియెన్.

416


వ.

అనఘ యివ్వనంబు మతంగవనం బనంబడు నీపుణ్యస్థానంబునం బులులు మృగం
బులుం గలసియుండు నేప్రాణులకు నైన నన్యోన్యవైరంబులు లే వమ్మునులసా
మర్థ్యంబున నీయాశ్రమంబున దేవతావిరచితవేది యున్నది యావేది నొక్కగృ
హంబు నిర్మించుకొని కడుఁబురాతనకాలంబున.

417


క.

ఎలమి మును హోమవేళం, బొలుపుగ మద్గురులు మంత్రపూతంబులుగా
జ్వలనుని నర్చించినవు, వ్వులు వాడవు దర్భ లెండవుం దగ నుండున్.

418


మ.

జననాథాగ్రణి యామహాత్ము లుపవాసశ్రాంతి మైఁ దీర్థముల్
సన లే కేడుపయోధులం దలఁప నాసప్తాబ్ధులుం జేరఁ జ
య్యన నేతెంచినఁ దారు గ్రుంకు లిడి యుద్యద్వల్కలంబుల్ దివం
బునకుం బోవుచుఁ బెట్టి పోయి రిలపైఁ బొల్పారెడుం జూడవే.

419


వ.

అని మఱియుం దమగురువుల సామర్థ్యంబులు పెక్కులు సెప్పి యే నమ్మునీశ్వరుల
పరిచారిణిం గాన వారికి శుశ్రూష సేయ వార లున్నపుణ్యస్థానంబున నీకళేబ