పుట:భాస్కరరామాయణము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కావిలుఁ డై వెసం బొలియు నాతఁడు దమ్ముఁడుఁ జచ్చు నన్నతోన్.

250


క.

అని పలికిన నక్కపటము, దనుజవిభుఁడు పొగడి నీవు తగుహితుఁడవు నా
కని వాని నాదరించుచుఁ, దనమది పొంగంగఁ గదలి తద్దయుఁ గడఁకన్.

251


తే.

నీచు తనపూర్వమంత్రి మారీచుకడకు
నేకతమ యేఁగ నతఁ డెదు రేఁగుదెంచి
ప్రియము సేసినఁ గైకొని నయముతోడ
నతని కిట్లని పలికె నెయ్యంబు దనర.

252


క.

ఖరుఁ డాదిగ మనవారలఁ, బొరిగొని రఘురాముఁ డనఁగఁ బోటరి యై దు
ర్నరుఁ డొకఁడు దండకాటవిఁ, దిరిగెడు ననుజుండుఁ దానుఁ దీనస్ఫురణన్.

253


ఉ.

వాని వధించి యొండె బలవంతపుమాయల ముంచి యొండె నా
కానరనాథుదేవి కుటిలాలక సీత యనంగ నొప్పున
బ్జాననఁ దెచ్చికోవలయు నన్నఁ గడుభయ మంది యాతఁ డ
ద్దానవనాథుతోడ నుచితం బగునీతి దలిర్ప ని ట్లనున్.

254


చ.

హరిహరపద్మజాదులకు నారఘురాముఁ డసాధ్యుఁ డమ్మహా
పురుషునిభార్య నేమిటికిఁ బుణ్యవిహీనతఁ గోరె దెందునుం
బరసతిఁ గోరువాఁ డధికపాతకుఁ డీచెడుబుద్ది నీకు నె
వ్వరు మది కింపుగాఁ బగుతువా రయి చెప్పిరి రాక్షసేశ్వరా.

255


చ.

అరదెగ గొన్నయేటునఁ గులాచల మైన హిమాద్రి యైన మం
దరగిరి యైన హేమవసుధాధర మైన నజాండ మైన ని
ష్ఠురతఁ బగుల్చు నక్కడిఁదిజోదు పురాంతకువిల్లు లీలమైఁ
బొరిగొని కొన్నభార్య యది పోలవు రావణ నీవిచారముల్.

256


తే.

అని యనేకవిధంబుల నతనియాగ్రహంబు డిగువడఁ జెప్పి రామావనీశు
నతులదివ్యాస్త్రమహిమయు నల్లఁ దెల్పి, వైర ముడిపిన రాక్షసవరుఁడు మగిడి.

257


క.

పురమునకు నరిగి విభవ, స్ఫురణంబు దలిర్పఁ బెంపు పొల్పొంద నిశా
చరకోటులు గొల్వఁగ మి, న్నొరసినయాపసిఁడిమేడ నున్నట్టియెడన్.

258


వ.

[1]అక్కడ శూర్పణఖయు సంగరాంగణంబున నత్తెఱంగున రఘుపుంగవునుగ్రశి
లీముఖంబులం దెగి బడలువడం బడినఖరదూషణాదిసమస్తపౌలస్త్యులకళేబరం
బులను గనుంగొని పొడమునాశ్చర్యభయశోకంబులు మనంబునం బెనంగొన న
వ్విధం బంతయు లోకవిద్రావణుం డగురావణున కెఱింగింతు ననుచు మహానా
దంబున రోదనంబు సేయుచుం బాఱి లంకానగరంబు సొచ్చి పుష్పకమధ్యంబున

  1. 259 మెదలుగా 262 వఱకుఁ గలపాఠమునకు
    చ. పొలుపఱ ముక్కునుం జెవులుఁ బోయిన మోటమొగంబుమీఁద న
        శ్రులు దొరుఁగంగ రక్కసులు చూచి కడున్ వెఱఁ గంద నార్తి ది
        గ్వలయము మ్రోయ నేడ్చుచును వచ్చి సభాస్థలిఁ గూల వ్రాలి పే
        రెలుఁగునఁ బేర్చి శూర్పణఖ యి ట్లని యేడ్చెఁ గరంబు దీనతన్.